
- భారీగా ఆస్తులు కూడ బెట్టినట్లు ఈడీ గుర్తింపు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రముఖ ఫర్టిలిటీ సెంటర్ గా గుర్తింపు పొంది అక్రమాలకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. రెండు రోజుల పాటు విచారణ జరిపిన తనంతరం సమ్రత తో పాటు ఆమె కుమారుడిని అరెస్టు చేసింది. సంతానం లేని వారి బలహీనతలు అసరాగా చేసుకుని భారీ ఎత్తున అక్రమంగా నగదును వసూలు చేసి నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సరోగసి పేరుతో కూడా లెక్కకు మించి వసూళ్లు చేశారని ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కూడా హవాలా రూపంలోనే డబ్బలు వసూలు చేసినట్లు అధికారులు విచారణ లో గుర్తించారు. తెలంగాణా, ఏపీ, మహరాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో చిన్నారులను విక్రయించి ఎంతో మందిని నమ్రత మోసం చేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.గతంలో గుజరాత్ చెందిన దంపతులను మోసం చేసిన కేసులో నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు. మరోసారి ఇప్పుడు ఈడీ అధికారులు ఆమెతో పాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.




Leave a Reply