NewsInn

News in a Click

ఈ వేస‌విలో అప్పుడే 40 డిగ్రీల‌కు తాపం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముందుంది మొస‌ళ్ల‌ పండ‌గ అనే నానుడికి ప్ర‌స్తుత వాత‌వ‌ర‌ణ ప‌రిస్థితి హెచ్చ‌రిస్తోంది. మార్చి మొద‌టి వారంలోనే రాష్ట్రంలో ఊష్టోగ్ర‌త‌లు భారీగా న‌మోదౌతున్నాయి. ఈరోజు అత్య‌ధికంగా 40 నుంచి 41 డిగ్రీల ఊష్ణోగ్ర‌త తెలంగాణాలోని ప‌లు ప్రాంతాల్లో న‌మోదైంది. శుక్ర‌వారం ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ బాద్, కొత్త‌గూడెం, ములుగు, మంచిర్యాల‌, ఆసీఫాబాద్, ఆదిలాబాద్, జ‌గిత్యాల ప్రాంతాల్లో ఈ రికార్డు ఊష్ణోగ్ర‌త న‌మోదు కాగా హైద‌రాబాద్ లో 37 నుంచి 38 డిగ్రీల వ‌ర‌కు న‌మోదైంది. ఈ ప‌రిస్థితి చూస్తుంటే రాబోయే మూడు నెల‌లు వేస‌వి ప్ర‌తాపం ఎలా ఉంటుందో ఆందోళ‌న క‌లిగించేలా క‌నిపిస్తోంది. అయితే ఈ నెల 16వ తేదీ త‌రువాత వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగానే మూడు, నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఆ త‌రువాత మ‌రోసారి భానుడి ప్ర‌తాపం మొద‌లు కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *