(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి
ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ… భవిష్యత్ లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు.

కాంగ్రెస్ కు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టడం వెనుక సీఎం కృషిని ప్రియాంక అభినందించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు.
మెరుగైన ఫలితాలు సాధించాం….కేటిఆర్
పురపాలక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని కేటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలవడంలో విఫలమయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం ఇవన్నీ కూడా పరాకాష్టకు చేరాయని విమర్శించారు.

మా పార్టీ నుంచి గెలిచిన వాళ్లను కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందని కేటిఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోకాంగ్రెస్, బిజెపి కలిసి పని చేసున్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా మేము కలుపుకున్నామని చెప్పారు. కొత్తగూడెంలో హంగ్ రావడంతో… ఆ స్థానం సీపీఐకి వదిలి పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటిఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యే తో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పినట్లు కేటిఆర్ వెల్లడించారు. మా మద్దతు అవసరమైన మున్సిపాల్టీలో ఎలా వ్యవహరించాలని అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుటామన్నరు.రేవంత్ రెడ్డికి నమ్మకం నమ్మకం ఉంటే, ఆ పది మందితో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు.
మా ప్రాతినిథ్యం మరింత పెరిగింది…రాంచందర్ రావ్

మున్సిపల్ ఎన్నికల్లో మా ప్రాతినిథ్యం మరింత పెరిగిందని బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. మొదటి సారి కరీంనగర్ కార్పోరేషన్ లో కశాయ జెండా ఎగురవేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావ్ అన్నారు. నిజామాబాద్ కార్పోరేషన్లో కూడా తమకు అవకాశం ఉందన్నారు. కార్పోరేషన్లు, వార్డు సభ్యులు కలిసి దాదాపు 350 స్థానాలను గెలుచుకుంటున్నామన్నారు. ఈ ఎన్నికల్లో మా ప్రాతినిథ్యం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. త్రిముఖ పోటీ కారణంగా కొన్నిచోట్ల బీజేపీ కి నష్టం జరిగిందని రాంచందర్ రావ్ అన్నారు. గతంలో ప్రాతినిథ్యం లేని ప్రాంతాలకు కూడా ఈ సారి బీజేపీ విస్తరించడం శుభపరిణామామన్నారు. ఈసారి తమ ఓట్ షేర్ 13 నుంచి 20 శాతానికి పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించింది గొప్ప విజయమేమి కాదన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు దౌర్జన్యాలతో విజయం దక్కించుకుందని ఆరోపించారు.





Leave a Reply