(హైదరాబాద్,న్యూస్ఇన్)

మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తైతే కీలక నేతలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో మరింత ఆసక్తి కరంగా మారాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలు తమ పట్టును నిలుపుకోవడంలో విజయవంతం అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే కోడంగల్ నియోజకర్గంలోని 3 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది. పూర్తి మెజార్టీ సాధించి కోడంగల్, కోస్గి, మద్దూరు నియోజకవర్గాల్లో చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోనుంది. బీఆర్ ఎస్ పార్టీ నామమాత్రపు స్థానాలకే నియోజకవర్గంలో పరిమితం అయింది. కోస్గి లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. కోడంగల్ లో బీఆర్ ఎస్ తరపున ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించారు. మద్దూరు మున్సిపాల్టీలో బీఆర్ ఎస్ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది.

మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ మరోసారి పట్టునిలుపుకుంది.మొత్తం 20 వార్డుల్లో 11 బీఆర్ ఎస్ గెలుచుకోగా 7 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు.ఒక స్థానంలో బీజేపీ, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో బీఆర్ ఎస్ కు ఇక్కడ చైర్మన్ పదవి దక్కనుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్లలో బీఆర్ ఎస్ సంపూర్ణంగా ఆధిపత్యం ప్రదర్శించింది. అధికార పార్టీని అతి తక్కవ స్థానాలకే పరిమితం చేయడంలో సక్సెస్ అయింది. 39 వార్డుల్లో 27 వార్డులను బీఆర్ ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. రెండో స్థానం కోసం ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడ్డ్డ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 6, బీజేపీ 5 స్థానాల్లో విజయం దక్కించుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు

ఇక సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు జరుగకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావ్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను నిర్వహించారు. జిల్లాలోని 19 మున్సిపాల్టీలో 11 పట్టణాల్లో గులాబీ జెండాను ఎగిరించారు. నగర శివారు నియోజకవర్గమైన పఠాన్ చెరులోని అన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాలను బీఆర్ ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. సంగారెడ్డి, ఆంధోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది.
ఇక ఆయా పట్టణాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి పట్టం కడుతారన్నది ఆసక్తి రేపుతోంది.





Leave a Reply