NewsInn

News in a Click

బీఆర్ఎస్ వైఫ‌ల్యంతోనే కాంగ్రెస్ విజ‌యం

  • పార్టీ పెట్ట‌క ముందే గెలుపొందాము

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ వైఫ‌ల్యంతోనే కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాలు ద‌క్కించుకుంద‌ని తెలంగాణా జాగృతి అధ్య‌క్షురాలు క‌విత అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ పాత్ర స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు ద‌క్కాయ‌న్నారు.ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బీఆర్ఎస్, బీజేపీ ద‌గ్గ‌ర‌య్యేందుకు అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. తాను గ‌తంలో చెప్పిన‌ట్లు భ‌విష్య‌త్తులో ఈ రెండు పార్టీలు క‌లిసి పోతాయ‌న్న విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేశారు. త‌మ పార్టీ ఇంకా ఏర్పాటు చేయ‌క‌పోయినా…. పోటీ చేసేందుకు ప‌లువురు ఔత్యాహికులు ముందుకు రావ‌డంతో కొన్ని స్థానాల్లో పోటీ చేసినా 33 స్థానాలు ద‌క్కించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇది ట్ర‌య‌ల్ మాత్ర‌మే అని అస‌లు సినిమా మందుంద‌ని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ ఇప్ప‌టికైనా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీపీఐ పార్టీ కాంగ్రెస్ మిత్ర‌ప‌క్ష‌మైన విష‌యాన్ని కూడా విస్మ‌రించింద‌ని సిపీఐ అడుగ‌క ముందే కేటిఆర్ ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి కొత్త‌గూడెం మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వికి మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని ప్ర‌క‌టించ‌డం ఏం రాజ‌కీయ‌మో అర్ధం కావ‌డం లేదన్నారు. సీపీఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాజీ సీఎం కేసిఆర్ ను విమ‌ర్శిస్తే కేటిఆర్ దాన్ని స‌మ‌ర్ధించిన‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *