
మాకు 30 వస్తాయనుకున్నాం కేటిఆర్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఏం సాధించారు.
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వాళ్లు ఆశించిన స్థానాలు దక్కలేదన్నారు. బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తో పోరాటం చేశారని చెప్పారు. సొంతంగా 30 స్థానాలు వస్తాయని అంచనా వేశాం….కనీ 17 మున్సిపాల్టీలను కైవసం చేసుకున్నామన్నారు. మరికొన్నిచోట్ల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పూర్తి మెజార్టీ రాని చోట్ల మరికొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు. బీజేపీ నేతలు ఈ ఫలితాలతో సంబరపడి పోతున్నారని,గత కంటే ఈ సారి తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లు ఎన్నికల ప్రచారం చేశారని అయినా ఆశించిన ఫలితాలు దక్కలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక అంశాలు, స్థానిక నేతల వ్యవహారం కారణంగానే ఎక్కువగా ఆధార పడాల్సి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీకి సానుకూల పలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణులు కష్ట పడడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఫలితాలను ఏక పక్షంగా ఫలితాలు రాలేదన్నారు. నేతలు, కార్యకర్తలు పనిచేసి సంతృప్తి కరంగా ఉందన్నారు. ఎక్స్ ఆఫిషియో సభ్యలకు సంబంధించి ఇంకా స్పష్టమైన నిర్ణయం లేదన్నారు.
తెరపైకి మరోసారి ఈ కార్ రేస్…..
ఈ కార్ రేస్ లో మరోసారి తనను విచారించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం వస్తుందని కేటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే నాలుగు సార్లు ఈ కేసులో తనను విచారించారని కేసులో పసలేదని అధికారులు గుర్తించారన్నారు. ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వెళుతానని ప్రభుత్వం జైల్లో పెట్టినా భయపడేది లేదన్నారు.



Leave a Reply