
బీసీసీఐకి హెచ్చరికలు
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
మరో 24 గంటల్లో ప్రాంభమయ్యే భారత్, పాక్ మ్యాచ్ పై పాక్ మాజీ క్రికెటర్ల డిమాండ్లు, హెచ్చరికలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పాక్ మాజీ క్రికెటర్లు తమనోటీకి పని చెబుతున్నారు. గతంలో జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ దూమారం రేపగా ఇప్పుడు ఆ అంశమే మరోసారి తెరపైకి వచ్చింది. రేపు సాయంత్రం కొలంబోలో జరిగే మ్యాచ్ లో భారత జట్టు ఆటగాళ్లు పాక్ జట్టు ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఈ విషయం ఎలా ఉన్నా ఈ సారి కరచాలనం చేయకపోతే బీసీసీఐ తీరును కోర్టుకు ఈడుస్తామని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల మధ్య సామరస్యక వాతావరణం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు,మూడు రోజుల క్రితం కూడా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ను తాను క్షుణ్ణంగా పరిశీలించానని దానికి డబుల్ రబ్బర్ టేప్ లు అతికించి ఉన్నాయని దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. పాక్ మారో మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ అభిషేకర్ శర్మ బ్యాటింగ్ విధానం టెక్నిక లేదని గాలి వాటం బ్యాటింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.





Leave a Reply