
సూర్యకుమార్ యాదవ్ రివర్స్ అటాక్
షేక్ హ్యాండ్ వివాదంపై కూల్ ఆన్సర్
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
కొలంబో లో ఆదివారం జరిగే హై ఓల్టేజీ క్రికెట్ మ్యాచ్ లో ఆ దేశ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఇప్పటికే మాటల యుద్ధం మొదలు పెట్టారు. మైండ్ గేమ్ తో భారత జట్టును దెబ్బకొట్టాలని పాక్ మాజీలు వరుసగా భారత జట్టు కీలక ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో భారత జట్టు కెప్టన్ సూర్య కుమార్ యాదవ్ పాక్ జట్టుపై ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో మీ దాయాది, ప్రత్యర్థి అని మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో సూర్య ఘాటుగా స్పందించారు. భారత్ జట్టుకు పాక్ జట్టుతో పోలిక ఏమిటని ప్రశ్నించారు. 20 మ్యాచ్ లు ఆడితే 8-9 అలా గెలుపులు ఉంటే సమఉజ్జీ గా భావించ వచ్చని గత రికార్డులన్నీ పరిశీలించాలని ఆ మీడియా ప్రతినిధికి సూచించారు. తాము పాక్ ను తమ సమ ఉజ్జీగా చూడడం లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు.10-1 గా మ్యాచ్ లలో విజయం సాధిస్తే మాకు ఆ జట్టుకు పోలికేమిటన్నారు.
అభిషేక్ శర్మపై….
మీడియా సమవేశంలో అభిషేక్ శర్మ విషయంలో కూడా అంతే సీరియస్ గా స్పందించారు. పాకిస్తాన్ కెప్టన్ ఆభిషేక్ శర్మ ఆడవచ్చని మీడియా సమావేశంలో చెప్పారని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించడంతో ఆ కెప్టెన్ కు అభిషేక్ మ్యాచ్ లో ఆడాలని ఉంటే ఖచ్చితంగా ఆడుతారని చెప్పారు….షేక్ హ్యాండ్ అంశంపై స్పందిస్తూ… సూర్య కూల్ గా సమాదానం చెప్పారు. 24 గంటలు ఆగాలని బాగా తినండి, బాగా నిద్రపొండి..రేపు చూద్దాం అంటూ ముగించారు.





Leave a Reply