- భారత్ పాక్ మ్యాచ్ పై అంచనాలు
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఈ రోజు సాయంత్రం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాయాది జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్ కు వాతావరణం అనుకూలిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరి వెంటాడుతున్న అనుమానం.ఈ పరిస్థితుల్లో కొలంబో లో ని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్న మ్యాచ్ పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం…. ఇక్కడ ఆడిన మ్యాచ్ లు వచ్చిన ఫలితాలు పరిశీలిద్దాం…….

భారత్ టీ20 రికార్డు..
ప్రేమదాస స్టేడియంలో భారత జట్టు 15 మ్యాచ్లు, పాకిస్తాన్ 7 మ్యాచ్లు ఆడింది. బారతజట్టు ఆడిన మ్యాచ్ లలో . 11 మ్యాచ్లను గెలిచింది. 2012లో జరిగిన ఆ మ్యాచ్లో భారత పాక్ జట్టు ఈ స్టేడియంలో తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత జట్టు జట్టు 8 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. భారత్ ఓడి పోయిన నాలుగు టీ -20 మ్యాచ్ లలో శ్రీలంకపై 3 సార్లు, ఆస్ట్రేలియాపై ఒక సారి భారత జట్టుపై విజయం సాధించాయి. భారత ఆటగాడు శిఖర్ ధావన్ కు ఇక్కడ అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఉంది.ధావన్ ఇక్కడ 284 పరుగులు చేశాడు. యుజ్వేంద్ర చాహల్ 12 వికెట్లతో టాప్ బౌలర్ గా ఉన్నారు.

భారత క్రికెట్ జట్టు…….. సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే,ఇషాన్ కిషన్(కీపర్), సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
పాకిస్తాన్……
పాకిస్తాన్ క్రికెట్ జట్టు 7 టీ20 మ్యాచ్లు ఆడి వీటిలో 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్ తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడు ఉమర్ అక్మల్ (182 పరుగులు), సయీద్ అజ్మల్ 8 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు……. సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్,షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, ఫఖర్ జమాన్, నసీమ్ షా, సల్మాన్ మీర్జా, ఖవాజా
ఈ మ్యాచ్ పై భారత జట్టు కెప్టన్ సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో పాక్ జట్టు ఓ పసికూన అన్నట్లే వ్యాఖ్యలు చేశారు.








Leave a Reply