NewsInn

News in a Click

హంగ్ స్థానాల్లో స్వ‌తంత్రుల డిమాండ్లు

హంగ్ స్థానాల్లో స్వ‌తంత్రుల డిమాండ్లు
  • పార్టీ అభ్య‌ర్థుల ష‌ర‌తులు
  • అధికార పార్టీ నేత‌లు ఓ అడుగు ముందు

( హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం మున్సిప‌ల్ కార్పోరేష‌న్ల మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మ‌న్ల ఎన్నిక‌లు జ‌రుగున్నాయి. 116 మున్సిపాల్టీల‌తో పాటు 7 కార్పోరేష‌న్ల‌లో ఫ‌లితాలు రెండు రోజుల క్రితమే వెలువ‌డ్డాయి. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం 16వ తేదీన మేయ‌ర్, డిప్య‌టీ మేయ‌ర్, చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ల ఎన్నిక‌లు ప‌రోక్ష ఎన్నిక‌ల ద్వారా జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం ఆయా మున్సిపాల్టీల్లో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాజ‌కీయ పార్టీల‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ సాధించిన మున్సిపాల్టీల్లో ఈ స్థానాలు ద‌క్కించుకోవ‌డం ఇబ్బంది లేక‌పోయినా…. మెజార్టీ రాని మున్సిపాల్టీల‌పైనే అంద‌రి దృష్టి ఉంది.

ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే పూర్తి మెజార్టీ వ‌చ్చినా….రాక‌పోయినా గెలుపొందిన స‌భ్యుల‌ను ఆయా రాజ‌కీయ పార్టీలలు శిబిరాల‌కు త‌ర‌లించాయి. రాజ‌కీయంగా అక్క‌డ పాగా వేసేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. కొన్ని మున్సిపాల్టీల్లో గెలుపొందిన అభ్య‌ర్థులు చేస్తున్న డిమాండ్లు చైర్మ‌ర్, మేయ‌ర్ రేస్ లో ఉన్న వారిని క‌ల‌వ‌ర పెట్టేవిగా మారుతున్నాయి. వారిని దారికి తెచ్చుకునేందుకు అనుస‌రించాల్సిన అన్ని విధాల‌ను రేసులో ఉన్న నేత‌లు అనుస‌రిస్తున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌ర శివారు మున్సిపాల్టీల్లో క‌ళ్లు బైర్లు గ‌మ్మెలా గెలుపొందిన అభ్య‌ర్థుల డిమాండ్లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొయినా బాద్ మున్సిపాల్టీలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాక‌పోవ‌డంతో బీజెపీ, బీఆర్ ఎస్ ఇరు పార్టీల నుంచి విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇరు పార్టీల నేత‌ల కూడా త‌మ‌కు వైస్ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు కోట్ల రుపాయ‌ల డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు అనుస‌రించాల్సిన క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికీ అభ్య‌ర్థుల‌తో చ‌ర్చ‌లు వ‌యూ జ‌రుపుతున్న ఆయ‌న కాంగ్రెస్ కు మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానం క‌ట్టబెట్టెలడంపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

కీల‌క మున్సిపాల్టీలు, కార్పోరేష‌న్ల‌లో పాగా వేసేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం సాయంత్రం మంత్రుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయి చ‌ర్చించారు. వీలైన‌న్ని స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు అనుగుణంగా పావులు క‌దుపాల‌ని నేత‌ల‌ను ఆదేశించారు. ప‌లువురు నేత‌ల‌ను ఇంచార్జ‌లు గా నియ‌మించారు.జగిత్యాలకు మంత్రి అడ్లూరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు ,కొత్తగూడెం బాధ్యతలు మంత్రి పొంగులేటికి,అప్పగించిన సీఎం రేవంత్‌.. కరీంనగర్‌ కార్పొరేషన్‌ బాధ్యత మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్ కు, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ బాధ్యతలు పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌కు అప్పగించారు ఇదే విధంగా హంగ్ వ‌చ్చిన మున్సిపాల్టీల్లో కీల‌క కాంగ్రెస్ నేత‌లు ఇంచార్జ్ నేత‌ల స‌మ‌న్వ‌యంగా కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపై క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు.

బీఆర్ఎస్ వైఫ‌ల్యంతోనే కాంగ్రెస్ విజ‌యం సాధించింద‌ట‌….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *