NewsInn

News in a Click

కొలంబో వెళితే జేబుకు చిల్లులే …! ఆలోచించండి

కొలంబో వెళితే జేబుకు చిల్లులే …! ఆలోచించండి
  • హోట‌ళ్ల లో రూం దొర‌క‌డం గ‌గ‌న‌మే

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

భార‌త్, పాక్ క్రికెట్మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్య‌త దృష్ట్యా అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్ పై ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. ఎంతో మంది ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్ చూసేందుకు కొలంబోకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు.దీన్ని అస‌రగా చేసుకుని వ్యాప‌ర సంస్థ‌లు క్రికెట్ అభిమానుల‌ను దోచుకునే విధంగా చార్జీల‌ను పెంచి వ‌సూలు చేస్తున్నాయి. భార‌త దేశం నుంచి కొలంబో వెళ్లేందుకు ఉంటే చార్జీల‌తో పోల్చుకుంటే మ్యాచ్ సంద‌ర్భంగా ఒక్కో ఏయిర్ లైన్ ఒక్కో రకంగా ధ‌ర‌ను పెంచింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా కొలంబో వెళ్లాలంటే ఇదే ప‌రిస్థితి ఉంది.

ఈ స‌మ‌యంలో కొలంబో వెళ్లే అన్ని ఫ్లైట్ చార్జీలు కూడా రెండు రోజుల నుంచి ఊహించ‌ని పెంచేశాయి.భార‌త్ నుంచి రు.10 వేల లోపు ఉండే విమానాచార్జీలు 40 నుంచి 82 వేల వ‌ర‌కు విమాన‌యాన సంస్థ‌లు స‌వరించాయి.కొలంబోలో హోట‌ల్ ద‌ర‌లు భారీగా పెంచారు. బ‌డ్జెట్ హోటల్స్ లో 3 వేల వ‌ర‌కు ఉండే ఒక రాత్రి బ‌స‌కు 12 వేల‌కు ద‌ర‌లు పెంచారు. స్టార్ హోటళ్ల‌లో 7 నుంచి 12 వేల వ‌ర‌కు ఒక రాత్రికి సాధార‌ణంగావ‌సూలు చేసే హోట‌ళ్లు ఈ మ్యాచ్ 20 నుంచి 50వ వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నాయి.

హ‌మ్మ‌య్య‌….వ‌ర్షం ముప్పు లేద‌ట‌……

ఈ రోజు సాయంత్రం భారత‌- పాక్ జ‌ట్ల జ‌రిగే హై ఓల్టేజీ మ్యాచ్ కు వ‌రుణుడి ముప్పు ఉంద‌ని గ‌త రెండు, మూడు రోజులుగా వాతావ‌ర‌ణ శాఖా అంచ‌నా వేసింది. ఈ అంచ‌నాలు క్రికెట్ అభిమానుల‌ను కొంత ఆందోళ‌న‌కు గురిచేశాయి. అస‌లే హై ఓల్టేజీ మ్యాచ్ రోజు వ‌ర్షం ప‌డితే మ్యాచ్ ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఈ మ్యాచ్ ఆడ‌డంపై ముందు నుంచి కొన‌సాగుతున్న స‌స్పెన్స్ వ‌రుణుడు కూడా కొన‌సాగిస్తున్నాడ‌న్న చ‌ర్చ జ‌రిగింది.అయితే తాజాగా వాతావ‌ర‌ణ నిపుణుల అంచ‌నా ప్ర‌చారం ఈ రోజు కొలంబోలో జ‌రిగే మ్యాచ్ కు వాతావ‌ర‌ణ ముప్పు లేక‌పోవ‌చ్చు అని అంచ‌నా వేస్తున్న‌రు. ఈ రోజంతా కొలంబో మేఘావృతమై ఉంటుంద‌ని అంచా… నిన్న సాయంత్రం తేలిక‌పాటి వ‌ర్షం కురిసినా అది మ్యాచ్ పై ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచే పొడి వాతావ‌ర‌ణం ఉటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వాతావ‌ర‌ణ నిపుణుల అంచ‌నా ప్ర‌చారం… శీలంక లోని ద‌క్షిణ ప్రావిన్స్ లో మ‌ధ్యాహ్నం త‌రువాత భారీ వ‌ర్షం ప‌డుతోంద‌న్న హెచ్చ‌రిక‌లు ఉన్నాయి. కొలంబో శ్రీలంలోని ప‌శ్చిమ ప్రాంతంలో ఉండ‌డంతో వ‌ర్షం ముప్పు లేద‌ని చెబుతున్నారు. కానీ రాత్రి పూట పొగ‌మంచు చుట్టుముట్టే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.

దీంతో హై ఓల్టేజీ మ్యాచ్ స‌జావుగా సాగేందుకు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లే. ఇరు జ‌ట్లు కూడా ఇప్ప‌టికే మ్యాచ్ పై గ్రౌండ్ బ‌య‌ట మాటకు మాట‌తో హీట్ పుట్టించాయి. పాక్ మాజీలు మ‌రో అడుగు ముందుకు వేసి రెండు,మూడు రోజుల నుంచి భార‌త్ పై మైండ్ గేమ్ మొద‌లు పెట్టారు. భారత కీల‌క ఆట‌గాళ్ల‌పై వెట‌కారం చేస్తున్న‌ట్లు వ్యాఖ్య‌లుచేస్తున్నారు. ఎవ‌రు ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా…… రెండు జ‌ట్లు కూడా త‌మ అత్యుత్త‌మ ఆట‌పైనే దృష్టి పెట్ట‌నున్నాయి. ఇండియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుందంటే క్రికెట్ అభిమానుల దృష్టి ఈ మ్యాచ్ పై నే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *