సేవకుడిగానే పనిచేస్తా -సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 90 శాతం ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయని, వీటిని చూసి తాను విర్రవీగనన్నారు. ప్రజల ఆమోదం ఉన్నన్ని రోజులు మంచి పాలన అందించడమే తన లక్ష్యమని చెప్పారు. కాంగ్రస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడ ప్రసంగించారు. సంత్ సేవాలాల్మానవ జాతి శాంతి మార్గం లో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నింపారన్నారు. సేవాలాల్ జయంతి అధికారికం గా జరపడం మా బాధ్యత అన్నారు.

రాష్ట్రం లో దళితులతో పాటు గిరిజనలు ప్రాధాన్యత ఉండాలి ఈ వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాలన్నారు.నాకు సీఎం హోదా రావడానికి లంబాడాల అండ దండలు ఉన్నాయి రాష్ట్రం లో ని అన్ని తండాలకు బీటీ రోడ్ లు వేయాలని ఆదేశాలు ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారు..అసైన్డ్ పట్టాల రూపం లో గిరిజనలకు భూములు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి భూములు లేవని, నాణ్యమైన విద్య ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు.నల్లమల లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం కోసం 20 ఎకరాల భూమి కేటాయించామని, వచ్చే జయంతి అక్కడే జరుపుకుందామన్నారు.గిరిజన సంప్రదాయాలు దెబ్బతినకుండా నిర్మాణాలు అక్కడ చేపడుతామని చెప్పారు.

ప్రజలు సేవ చేసేందుకు అవకాశం కల్పించారని అందుకు అనుగుణంగానే పనిచేస్తానన్నారు. కొంతమంది తాను అందిస్తున్న మెరుగైన పాలనను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని చెప్పారు. గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ ఆ హామీ నిలబెట్టుకోలేదని, జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీల కు ప్రభుత్వంలో 30 శాతం అవకాశం ఇచ్చాం.. నలుగురు మంత్రులు ,స్పీకర్ ఉన్నారు.. దళితుడు రాష్ట్రాన్ని నడపలేరు..నేనైతేనే నడుపుతా అన్న వాళ్ల అధ్యక్షా అని పిలిచి మైక్ అడిగేలా దళితుడిని పైన కూర్చొపెట్టానన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములకు నాదే బాధ్యత ..అని చెప్పానని అయితే దీన్ని కొంత మంది వక్రీకరిస్తున్నారని చెప్పారు.






Leave a Reply