
తెలంగాణా జాగృతి కవిత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదని ఇది గిరిజనలకు అన్యాయం చేస్తోందని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణా జాగృతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలగొన్న కవిత ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బంజారాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. సూవాలాల్ సందేశాలకు అనుగుణంఆ జాగృతి ముందుకు వెళుతుందని కవిత చెప్పారు. సేవాలాల్ ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని, సంఘ సంస్కర్త అని ఆమె అన్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానం గెలుచుకుంటే కాంగ్రెస్ దాన్ని తీసుకుందన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసే బీఆర్ ఎస్ అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. కాంగ్రెస్ కు కూడా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా ఇంకా సరైన సౌకర్యాలు లేవని ఈ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఒక్కో తండాకు 25లక్షల రుపాయాలు కేటాయించాలని డమాండ్ చేశారు. గిరిజనుల్లో నాయకత్వం మరింత అవసరమని దాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంగానే తాను జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా లంబాడా నేతను నియమించినట్లు కవిత చెప్పారు. బంజారాలకు ఆదివాసీలకు గొడవ పెట్టే విధంగా సీఎం వ్యవమరిస్తున్నారని ఆరోపించారు.







Leave a Reply