NewsInn

News in a Click

పాక్ మ్యాచ్ లో త‌డ‌బ‌డ్డ భార‌త బ్యాట‌ర్లు

  • ఇషాన్ మిన‌హా ఆచితూచి ఆడిన ఆట‌గాళ్లు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)

భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రిగిన దాయాది పోరులో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవ‌డంతో భార‌త జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది. ప‌రుగులు మొద‌లు కాక‌ముందే ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అభిషేక్ శ‌ర్మ భారీ హిట్టింగ్ కు వెళ్లి సున్నా ప‌రుగుల‌కే ఔట‌య్యారు. అప్ప‌టికీ భార‌త జ‌ట్టు స్కోరు 1-1 భార‌త జ‌ట్టు తొలి ఓవ‌ర్లోనే డిఫెన్స్ లో ప‌డింద‌న్న అనుమానాలు అంద‌రిలోనూ క‌లిగాయి. కానీ మ‌రో వైపు ఇషాన్ కిష‌న్ పాక్ బౌల‌ర్ల‌తో ఆట ఆడుకున్నారు. అస‌లు టీ-20 మ‌జా ఏమిటోఈ మ్యాచ్ లో మ‌రోసారి ఇషాన్ కిష‌న్ చూపించారు. పాకిస్తాన్ స్టార్ బౌల‌ర్ షాహీన్ ఆఫ్రిదీ ఒకే ఓవ‌ర్ వేసిన త‌రువాత ఇషాన్ హిట్టింగ్ తో పాక్ కెప్ట‌న్ త‌ప్పించారు. ఒక్క ఓవ‌ర్లోనే 15 ప‌రుగులు భార‌త జ‌ట్టు రాబ‌ట్టింది. 8 ఓవ‌ర్లు అయ్యే వ‌ర‌కు భార‌త జ‌ట్టు స్కోరు 80 ప‌రుగులు దాటి 10 రన్ రేట్ తో వెళుతున్న‌ట్లు క‌నిపించింది. 8.4 ఓవ‌ర్ల వ‌ద్ద స‌యిం అయూబ్ బౌలింగ్ లో ఇషాన్ బౌల్డ్ అయ్యారు. 8.4. ఓవ‌ర్ల‌లో 88 ప‌రుగులు చేసి భార‌త జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది. 3వ వికెట్ భాగ‌స్వామ్యం కోసం కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌లు ఆచి తూచి ఆడుతూ బ్యాటింగ్ ను ముందుకు తీసుకెళ్లారు. 9వ ఓవ‌ర్ నుంచి భార‌త స్కోరు మంద‌గించింది. ఆచితూచి ఆడుతూ అవ‌కాశం వ‌చ్చిన్ప‌పుడే హిట్టింగ్ చేశారు. పాక్ బౌల‌ర్లు కూడా క‌ట్టుదిట్ట‌మైన బంతులు వేసి భార‌త బ్యాట్స్ మెన్లను క‌ట్ట‌డి చేశారు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు స్కోరు 126 ప‌రుగుల‌కు చేరుకుంది అక్క‌డ తిల‌క్ వ‌ర్మ వికెట్ కోల్పోయింది. వ‌ర్మ 24 బంతుల్లో 25 ప‌రుగులు చేశారు. ఆ వెంట‌నే బ్యాటింగ్ వ‌చ్చిన హ‌ర్దిక్ పాండ్య భారీ షాట్ కొట్ట‌బొయి తొలి బంతికే వెనుదిరిగారు.

దీంతో ఒకే ఓవ‌ర్లో భార‌త జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ త‌రువాత స్కోరు ఆనుకున్నంత వేగంగా క‌ద‌లలేక‌పోయింది. పాక్ ట్రంప్ కార్డు బౌల‌ర్ గా ప్ర‌చారం ద‌క్కించుకున్న ఉస్మాన్ తారీక్ బౌలింగ్ లో భారీ షాట్లు ఆడేందుకు భార‌త బ్యాట్స్ మెన్లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. స్కోరు పెంచే క్ర‌మంలో 18 ఓవ‌ర్లో కెప్ట‌న్ సూర్య‌కుమార్ భారీ షాట్ ఆడ‌బోయి ఔట్ అయ్యారు.తారీఖ్ కు ఇదొక్క వికెట్ మాత్ర‌మే ద‌క్కింది. భార‌త జ‌ట్టు కోల్పోయిన వికెట్ల‌లో మూడు వికెట్లు స‌యిం అయూబ్ తీసుకున్నారు. చివ‌ర్లో శివం దూబె మెరుపుల‌తో భార‌త జ‌ట్టు స్కోరు 20 ఓవ‌ర్ల‌లో175 ప‌రుగుల‌కు చేరుకుంది ఆ స‌మ‌యంలో ప‌రుగు తీసేందుకు వెళ్లి దుబే ర‌న్ అవుట‌య్యారు. ఆ త‌రువాత చివ‌రి బంతిని బౌండ‌రీ ద‌గ్గ‌ర క్యాచ్ ఇచ్చి అక్ష‌ర్ అవుట్ అయ్యారు పాక్ విజ‌య ల‌క్ష్యం 176 ప‌ర‌గుల‌ను భార‌త్ ఉంచింది.పాకిస్తాన్ 20 ఓవ‌ర్లను వేసేందుకు 7 గురు బౌల‌ర్ల‌ను ప్ర‌యోగించ‌డం విశేషం. కేవ‌లం షాహీన్ ఆఫ్రీదీ మాత్రం రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి భారీగా ప‌రుగులు ఇచ్చుకున్నారు.

భార‌త్ బ్యాటింగ్

ఇషాన్ కిషన్ 40 బంతులు 77 ప‌రుగులు (10 ఫోర్లు, 3 సిక్స్ లు)
అభిషేక్ శ‌ర్మ – 0
తిల‌క్ వ‌ర్మ – 24 బంతులు 25 ప‌రుగులు
సూర్య‌కుమార్ యాద‌వ్ -29 బంతులు 32 ప‌రుగులు ( 3 ఫోర్లు)
శివ‌మ్ దుబే 17 బంతులు 27 ప‌రుగులు ( 3 ఫోర్లు , 1 సిక్స్‌)
రింకూ సింగ్ 11 నాటౌట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *