- పాక్ బౌలర్లపై “ఇషాన్” సర్జికల్ స్ట్రైక్
- భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన పాక్
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
హై ఓల్టేజీ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాప్ పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ మ్యాచ్ పాకిస్తాన్ ఏ దశలోనూ భారత జట్టుకు పోటీ ఇచ్చినట్లు కనిపించలేదు. మ్యాచ్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు నిజమనేలానే మ్యాచ్ సాగింది. మాకు పాక్ ఎక్కడా సమ ఉజ్జీకాదని సూర్య చెప్పినట్లే మరోసారి ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత్ పాక్ పై ఏకపక్షంగా విజయం దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 175 పరుగులు సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్ 114 పరుగులకు అలౌట్ అయింది.
పాక్ బౌలర్లపై “ఇషాన్” సర్జికల్ స్ట్రైక్…..

పాక్ టాస్ గెలువడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ ను ఆదిలోనే కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కానీ ఇషాన్ కిషన్ మరోసారి తన బ్యాట్ కు పని చెప్పి పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఇషాన్ క్రీజులో ఉన్నంత సేపు భారత జట్టు స్కోరు ఫోర్లు, సిక్స్ లో మారుతూ వచ్చింది. 8 ఓవర్లలోనే 80 పరుగుల స్కోరును భారత జట్టు చేరుకుంది. వీటిల్ ఇషాన్ చేసిన పరుగులే సింహ భాగం ఉన్నాయి. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత జట్టు స్కోరు సులువుగా 200 పరుగులు దాటుతుందనేలా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న ఇషాన్ తన జోరును ఆలాగే కొనసాగించే యత్నంలో 40 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యారు. అప్పటికి భారత జట్టు స్కోరు 88 పరుగులు అందులో ఇషాన్ సాధించనవే 77 పరుగులు అంటే ఇషాన్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత జట్టు స్కోరు కొంత మందగిస్తూ ముందుకు సాగింది. తిలక్ వర్మ, 25 పరుగుల చేయగా, సూర్యకుమార్ యాదవ్ 32 పరుగుల చేశారు. శివమ్ దుబే చివర్లో 17 బంతుల్లో 27 పరుగులు సాధించడంతో భారత జట్టు స్కోరు 175 పరుగులకు చేరుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో సయీం అయూబ్ 3 వికెట్లు పడగొట్టారు. ట్రంప్ కార్డుగా ప్రాచంర పొందిన ఉస్మాన్ తారీఖ్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు.
61 పరుగుల తేడాతో విజయం….

176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ తొలి ఓవర్ నుంచే కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఆ జట్టు ఓపెనర్ శహాబ్ జాదా ఫర్హన్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగారు. ఆ ఆతరువాతి ఓవర్ వేసిన బూమ్రా పాకిస్తాన్ జట్టును కోలుకోని విధంగా దెబ్బ తీశారు రెండో ఓవర్లోనే పాకిస్తాన్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. రెండు ఓవర్లలోనే 13 పరుగులకు 3 కీలక వికెట్లు పాక్ కోల్పోయింది. సయీం అయూబ్, సల్మాన్ ఆఘా వికెట్లను బూమ్రా తీసుకున్నారు ఆ తరువాత ఆచి తూచి ఆడుతున్నట్లు కనిపించిన నాలుగు ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. భారత స్పిన్నర్లు బరిలో దిగడంతో… 5 ఓవర్ లోనే 34 పరుగల వద్ద పాకిస్తాన్ కోహ్లీగా పిలుచుకునే బాబర్ అక్షర్ పటేలో బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు.

దీంతో పాకిస్తాన్ మ్యాచ్ పై పూర్తిగా విజయావకాశాలను కోల్పోయింది. కేవలం 5 పరుగులు చేసిన బాబర్ పెవీలియన్ చేరుకున్నారు. ఐదో వికెట్ భాగస్వామ్యం పాక్ జట్టును ఆశలు రేకిత్తించింది. ఆ భాగస్వామ్యం 11 వ ఓవర్ చేరుకునే సరికి 73 పరుగులు సాధించి ఐదో వికెట్ కోల్పోయింది. ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 పరుగులు చేసి ఔట్ కావడంతో… పాక్ నిలదొక్కుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఆ తరువాత పాక్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 78 పరుగుల వద్దే 6,7 వికెట్లు కోల్పోయింది. 97 పరుగుల వద్ద 8,9 వికెట్లు కోల్పోయింది. 114 పరుగులకు పాక్ జట్టు 18 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించారు.

పాండ్య -2, బూమ్రా-2, అక్షర్-2, వరుణ్ -2 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మలు ఒక్కో వికెట్ పడగొట్టారు.ఇక మ్యాచ్ భారత గుప్పిట్లోకి రావడంతో భారత జట్టు కెప్టెన్ బౌలింగ్ ప్రయోగాలు చేశారు. తిలక్ వర్మ, రింకీ సింగ్ లతో బౌలింగ్ చేయించారు.
సూర్య చెప్పినట్టే పాక్ చేతులెత్తేసిందే……







Leave a Reply