NewsInn

News in a Click

పాక్ కెప్ట‌న్ వ్యాఖ్య‌లు….న‌వ్వులు పూయిస్తున్నాయి

  • కొన‌సాగుతున్న పాక్ ఓట‌మి ప‌రంపర‌

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌)

హై ఓల్టేజీ మ్యాచ్ ఏక‌ప‌క్షంగా సాగ‌డంతో భార‌త క్రీడాభిమానుల్లో ప‌ట్ట‌లేని ఆనందం ఏర్ప‌డింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేరుకుంది. ఆ త‌రువాత బ్యాటింగ్ కు దిగిన పాక్ 18 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగ‌ల‌కే ఆలౌట్ అయింది. దీంతో పాక్ పై భార‌త జ‌ట్టు 61 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం ద‌క్కించుకుంది. మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ భార‌త జ‌ట్టు ఆటగాళ్లు ఉత్త‌మ‌ స్థాయిలో త‌మ ప్ర‌ద‌ర్శ‌న చెశార‌ని చెప్పారు. ఇక పాక్ కెప్ట‌న్ సల్మాన్ అలీ మాట్లాడతూ భార‌త జ‌ట్టు పై ఆడే మ్యాచ్ లో టెన్ష‌న్ ఉండ‌డం స‌హ‌జ‌మే అయినా నాలుగు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలో దిగ‌డం క‌లిసి రాలేద‌న్న అబిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దీంతో పాటు పాక్ జ‌ట్టు ప‌వ‌ర్ ప్లేలో వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేద‌ని చెప్పారు. పాక్ కెప్ట‌న్ మాట్లాడుతున్న స‌మ‌యంలో తీసిన ఓ వీడియో ఎక్స్ లో షేర్ చేయ‌డంతో అది వైర‌ల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *