
- లంక విజయలక్ష్యం 182 పరుగులు
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచ కప్ లో పసికూన జట్లు రాణిస్తుండడంతో కీలక జట్లకు చిక్కులు తప్పడం లేదు. సూపర్ 8 కు చేరుకోవాలంటే ఖచ్చితంగా విజయంసాధించాల్సిన పరిస్థితి ఆస్ట్రేలియాకు ఏర్పడింది. జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన ఆస్ట్రేలియా శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరును టార్గెట్ గా ఇచ్చింది. గత మ్యాచ్ అనుభవంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు ముందు నుంచే దూకుడు గా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు మైఖెల్ మర్ష్, ట్రావిస్ హెడ్ లు శ్రీలంక బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు.

పవర్ ప్లేను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 8 ఓవర్లలోనే వంద పరుగులకు చేరుకుంది. మార్ష్ 27 బంతులు ఎదుర్కొని ( 8 ఫోర్లు, 2 సిక్స్ ) ల సహాయంతో 54 పరుగులు రాబట్టగా, హెడ్ 29 బంతులు ఆడి ( 7 ఫోర్లు, 3 సిక్స్ లు) 56 పరుగులు చేశారు.104 పరుగుల స్కోరు దగ్గర హేడ్ తొలి వికెట్ గా వెనుదిరిగారు ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన గ్రీన్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నారు. జోరు మీదున్న మార్ష్ 116 పరుగల వద్ద 3వ వికెట్ గా ఔటయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు రన్ రేట్ మందగించింది. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లు కూడా శ్రీలంక బౌలర్లను ఆచి తూచి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓపెనర్ల తరువాత అత్యధిక పరుగులు జోష్ ఇంగ్లీష్, మాక్స్ వెల్ లు మాత్రమే డబుల్ డిజిట్ పరుగులు చేశారు. వీరు 27, 22 పరుగులు చేశారు.

ఇక మిగిలిన బ్యాట్స్ మెన్లు శ్రీలంక బౌలర్లను ఎదుర్కొని పరుగులు పెద్దగా చేయలేకపోయారు. 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 181 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శీలంక బౌలర్లలో దుషాన్ హేమంతా 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. చమీర 36పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మాక్స్ వెల్ దూకుడుగా ఆడుతున్న సమయంలో పతూన్ నసాంక తీసుకున్న క్యాబ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.182 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంక భారీ చేదనలో మొదటి వికెట్ తొందరలోనే కోల్పోయింది. 15.4 ఓవర్లలో147 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
సూపర్ 8 ఎంట్రీకి జట్ల మధ్య పోరు మొదలు కావడంతో మ్యాచ్ లుఆసక్తి కరంగా మారుతున్నాయి.







Leave a Reply