- పతున్ నిసాంక సెంచరీ
( స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
అసీస్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక జట్టు ఆసీస్ పై 8 వికెట్ల తో ఘన విజయాన్ని సాధించింది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శీలంక 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 184 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయంసాధించడంతో ఇక ఆస్ట్రేలియా సూపర్ 8 లోకి ఎంటర్ కావడం మరింత ఇబ్బంది కరంగా మారింది. ఓమన్ తో మ్యాచ్ లో విజయం సాధించినా కష్టంగానే కనిపిస్తోంది. గ్రూప్ బీ లో శ్రీలంక, జింబాబ్వేలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఓటమితో ఆసీసీ 3వ స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక తొలి వికెట్ తొందరగానే కోల్పోయింది. కుషాల్ పెరిరీ ఒకే పరుగు చేసి వెనుదిరిగారు….ఆ తరువాత లంక బ్యాట్స్ మెన్లు ఆస్ట్రేలియాకు కొరకరాని కొయ్యలుగా మారారు. పతున్ నిషాంక, కుషాల్ మెండిస్ లు ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చలాయించారు. మెండిస్ 38 బంతులు ఎదుర్కొని 51 పరుగులు సాధించారు. (6 ఫోర్లు ఒక సిక్స్) సోయినస్ బౌలింగ్ లో కూపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఈ ఇద్దరే మ్యాచ్ ను పూర్తి చేస్తారన్న స్థాయిలో అస్ట్రేలియాను ఆడుకున్నారు.

105 పరుగుల వద్ద మెండిస్ ఔట్ అయిన తరువాత పతున్ నిషాంకకు పవన్ రత్నాయకే జత కలిశారు. ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియా బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా విరుచుకు పడ్డారు. అసీస్ బౌలర్లను నిషాంక ఎదుర్కొన్న తీరు లంక అభిమానుల్లో జోరు నింపింది. అసీస్ పై విరవిహారం చేసికే వలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించి ( 10 ఫోర్లు, 5 సిక్స్ లు) ఆసీస్ పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అసీస్ బౌలర్లు శ్రీలంక బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో ఎక్కడా ఆధిపత్యం చూపించలేకపోయారు.
ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరును టార్గెట్ గా ఇచ్చింది. గత మ్యాచ్ అనుభవంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు ముందు నుంచే దూకుడు గా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు మైఖెల్ మర్ష్, ట్రావిస్ హెడ్ లు శ్రీలంక బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. పవర్ ప్లేను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 8 ఓవర్లలోనే వంద పరుగులకు చేరుకుంది. మార్ష్ 27 బంతులు ఎదుర్కొని ( 8 ఫోర్లు, 2 సిక్స్ ) ల సహాయంతో 54 పరుగులు రాబట్టగా, హెడ్ 29 బంతులు ఆడి ( 7 ఫోర్లు, 3 సిక్స్ లు) 56 పరుగులు చేశారు.104 పరుగుల స్కోరు దగ్గర హేడ్ తొలి వికెట్ గా వెనుదిరిగారు ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన గ్రీన్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నారు.

జోరు మీదున్న మార్ష్ 116 పరుగల వద్ద 3వ వికెట్ గా ఔటయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు రన్ రేట్ మందగించింది. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లు కూడా శ్రీలంక బౌలర్లను ఆచి తూచి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓపెనర్ల తరువాత అత్యధిక పరుగులు జోష్ ఇంగ్లీష్, మాక్స్ వెల్ లు మాత్రమే డబుల్ డిజిట్ పరుగులు చేశారు. వీరు 27, 22 పరుగులు చేశారు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్లు శ్రీలంక బౌలర్లను ఎదుర్కొని పరుగులు పెద్దగా చేయలేకపోయారు. 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 181 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శీలంక బౌలర్లలో దుషాన్ హేమంతా 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. చమీర 36పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మాక్స్ వెల్ దూకుడుగా ఆడుతున్న సమయంలో పతూన్ నిసాంక తీసుకున్న క్యాబ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
శీలంక టీ-20 మ్యాచ్ లో భారీ స్కోరును ఛేదించి పల్లెకల్లెలో విజయం నమోదు చేసుకుంది.
.


Leave a Reply