NewsInn

News in a Click

ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలి

అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చండి

మాట ఇచ్చాం… విద్యుత్ ఛార్జీలు పెంచం

అప్పులన్నింటినీ రీ-షెడ్యూల్ చేస్తున్నాం

సీఎం చంద్రబాబు నాయుడు

(అమరావతి,న్యూస్ ఇన్)

ప్రజలు మెచ్చే పాలన అందించే దిశగా ప్రతి విభాగం, ప్రతి అధికారి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కాన్ఫరెన్సు జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరయ్యారు. వృద్ధిరేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు.

అలాగే మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్సు అంశాలపై సూచనలు చేశారు. దీంతో పాటు సూపర్ సిక్స్ పథకాల, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు సీఎం సూచనలు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ..‘18 నెలల పాలను సమీక్షించుకుని ఈ ఆర్ధిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చించకుని ఆ దిశగా అందరూ పని చేయాలి. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది… ప్రజలు మెచ్చే పాలన అందించాలి. ఫైళ్లు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చు. ప్రజల అవసరాల కోసం రాజ్యాంగాన్నే చాలాసార్లు సవరణలు చేశారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే పరిస్థితి ఉండకూడదు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరే పరిస్థితి రావాలి.

స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లను రేషనలైజ్ చేసి గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అవసరమైనట్టుగా విధులు చేపట్టేలా మార్చుకుందాం. ప్రతీ ప్రభుత్వ శాఖ ఓ మంచి ఫలితాల కోసమే పనిచేస్తోంది. ఆ ప్రయోజనాలు ప్రజలకు తెలియాలి. విద్య, విద్యుత్, నీటి భద్రత, వ్యవసాయం, వైద్యం సహా వివిధ శాఖల్లో సంస్కరణలు అమలు చేస్తున్నాం. ప్రజలపై భారం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రూ. 9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. కానీ దీని వల్ల ప్రజలపై భారం పడుతుంది. అందువల్ల ఈఆర్సీ సూచనల అమలు చేయడం లేదని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *