అధికారుల తీరుపై బాబు అసహనం
18 నెలలు అవుతున్న అధికారుల తీరు మారడం లేదు
(అమరావతి,న్యూస్ ఇన్)
ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానం మార్చుకోవాలని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా…. కొంతమంది అధికారుల పనితీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతలను 10 గంటలకు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఉన్నతాధికారులంతా శాస్త్రీయంగా ఆలోచన చేసి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాన్నారు. నిధుల లభ్యత తక్కువగా ఉన్నా… అభివృద్ధి పనులు ఆగకుండా చూడాలి. ఈ విధంగా చేయాలంటే అధికారులు వినూత్నంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని జోన్లుగా, రీజియన్లుగా, కారిడార్లుగా, క్లస్టర్లుగా హబ్ లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అన్ని శాఖలు, అన్ని ప్రభుత్వ సేవల్లో ప్రజల్లో సంతృప్త స్థాయిని నమోదు చేస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలతో చక్కగా వ్యవహరించాలి. టీటీడీ పనితీరు మెరుగు అవుతోంది. కానీ దేవదాయ శాఖ పని తీరు మెరుగు పడడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. జనవరి 15 నాటికి అన్ని సేవలూ ఆన్ లైన్లో సేవలందించే పరిస్థితి రావాలి.”అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


Leave a Reply