NewsInn

News in a Click

తెలంగాణాలో అకాల వ‌ర్షాలకు చాన్స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

మ‌రో నాలుగు రోజుల్లో తెలంగాణాలోని ప‌లు ప్రాంతాల్లో ఆకాల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఈ నెల 22 వ తేదీ నుంచి ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖాధికారులు వెల్ల‌డించారు. 24 లేదా 25వ తేదీ నుంచి ఈ ప్ర‌బావం ఎక్కువ‌గా ఉండే చాన్స్ ఉంద‌ని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ములుగు ప్రాంతాల్లో ఆకాల వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ట‌. 24వ తేదీ నుంచి హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల‌తో పాటు తెలంగాణాలోని మెజార్టీ ప్రాంతాల్లో ఈ ఆకాల వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. కొన్ని చోట్ల వ‌డ‌గ‌ళ్లతో వ‌ర్షాల‌తో పాటు 20 నుంచి 40 మి.మీ వ‌ర‌కు కూడా వ‌ర్షపాతం న‌మోద‌య్యే చాన్స్ ఉంద‌ని హెచ్చ‌రించారు.తుఫానుల కార‌ణంగా ఈ ప్ర‌భావం వేస‌విలో అకాల వ‌ర్షాల‌కు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వ‌స్తోంది. ప్ర‌ధానంగా రైతులు ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచిస్తోంది. అకాల వ‌ర్షాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *