- హాజరైన కేటిఆర్, హరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రవేఖర్ రావ్ పుట్టిన రోజు వేడుకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ గులాబీ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణా భవన్ లో జరిగిన బర్త్ డే వేడుకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావులు హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేటిఆర్, హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో బలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొన్న విషయాన్ని కేటిఆర్ గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఆ సమయంలో బలంగా ఉన్న పార్టీలని వ్యాఖ్యానించారు. తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం, ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం—ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో కేసిఆర్ ఉద్యమాన్ని నడపించార్నారు.

ఉద్యమం తరువాత ముఖ్యమంత్రిగా అవకాశం దక్కడంతో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగన నిలబెట్టారని చెప్పారు.తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఉద్యమకారుల మీదికి తుపాకులతో దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తందని ప్రశ్నించారు. కేసీఆర్ జాతి గురించి కొంత మంది అడుగుతున్నారని అలాంటి అల్పులకు తాను ఒకటే సమాధానం చెబుతానన్నారు. అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది అన్నారు. ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతుల జాతి మాది కాదన్నారు. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి మాది కాదన్నారు. తెలంగాణాలో రెండే జాతులు ఉన్నాయయని, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి అని వ్యాఖ్యలు చేశారు.

హరీష్ రావ్……..
ఈ రోజును కేసీఆర్ పుట్టిన రోజుగానే కాదు….ఒక నాయకుడి పుట్టిన రోజు కాదు,… తెలంగాణా ఉద్యమం పుట్టిన రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ, ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నది అంటే దానికి ఒకే ఒక్కడు కేసీఆర్ కారణజన్ముడని అన్నారు. ధర్మం దారి తప్పినపుడు, అధైర్యం రాజ్యమేలినప్పుడు దేవుడు దారి చూపిస్తాడు అని భగవద్గీతలో ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే కేసిఆర్ తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ యాస, భాష, జాతి గౌరవం దెబ్బతిన్న సమయంలో నేనున్నానంటూ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్లిన రోజును హరీష్ రావ్ గుర్తు చేశారు. తెలంగాణా కోసం ఎన్నో త్యాగాలు కేసిఆర్ చేశారన్నారు.ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని హరీష్ అ న్నారు. కేసీఆర్ ఉద్యమ కారుడే కాదని, చరిత్ర కారుడు, పాలనా దక్షుడు అని చరిత్ర పుటల్లో నిలిచిపోయిందన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలకు ప్రాణం





Leave a Reply