NewsInn

News in a Click

కేసిఆర్ బ‌ర్త్ డే- క‌విత ట్వీట్- అనుమానాలు

కేసిఆర్ బ‌ర్త్ డే- క‌విత ట్వీట్- అనుమానాలు
  • క‌ల‌కం రేపుతున్న క‌విత ట్వీట్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంతో మంది ఆయ‌న‌కు నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్ప‌క‌పోయినా…. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ఎంతో మంది బ‌ర్త్ డే విషెష్ చెప్పారు. ఒక్కొక్క‌రు ఒక్కో రకంగా తాము అభిమానించే నేత గురించి ట్విట్ చేయ‌డం జ‌రిగింది. ఎవ‌రు ట్వీట్ లో ఏం రాశారాన్న‌ది పెద్ద‌గా సంబంధం లేక‌పోయినా….. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు క‌విత ట్వీట్ మాత్రం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌తంలో పార్టీలో ఉన్న స‌మ‌యంలో త‌న పుట్టింటికి వెళ్లి కేసిఆర్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్షులు చెప్పిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ త‌రువాత ఈ సారి అంద‌రు నేత‌ల మాదిరిగానే క‌విత త‌న ఎక్స్ అకౌంట్ ద్వారా కేసిఆర్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పింది. హా…..ఇది సాధార‌ణ‌మే…కానీ ట్విట్ సంద‌ర్బంగా రాసిన రాత ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తోంది. క‌విత చేసిన ట్వీట్ లో ఉద్య‌మ నాయ‌కులు గౌర‌వ పెద్ద‌లు శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావ్ గారికి హార్ధిక జ‌న్మ‌దిన శుభాకాంక్షులు అని మాత్ర‌మే ఉంది.

మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ కు ఎక్స్ ద్వారా నే జ‌న్మ‌దిన శుభాకాంక్షులు తెలిపారు. నిత్యం కేసీఆర్ ను రాజ‌కీయంగా విమ‌ర్శించ‌ని రోజు లేనిదే ఉండ‌ని రేవంత్ ట్విట్ట‌ర్ ద్వారా జ‌న్మ‌దిన శుభాకాంక్షులు తెలుపుతూనే ఆ భ‌గ‌వంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాన‌ని అని పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా కేసిఆర్ కు ఎక్స్ ద్వ‌రా శుభాకాంక్షులు తెలియ‌చేస్తూ.. ఆయురారోగ్యాల‌తో, దీర్ఘాయుష్షుతో జీవించాల‌ని ప్రార్థిస్థున్నాను అని ట్వీట్ చేశారు.

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కేసిఆర్ కు బ‌ర్త్ డే శుభాకాంక్షులు తెలియ‌చేస్తూ….. కేసిఆర్ తో క‌లిసి ఉన్న ఫోటోను పోస్టు చేస్తూ హృద‌య‌పూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్షులు అని పేర్కొన్నారు. దీంతో పాటు మీ ఆరోగ్యం, దీర్ఘ‌యుష్సు కోసం ప్రార్థిస్తున్నాన‌న్నారు.

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా ఎక్స్ ద్వారానే శుభాకాంక్షులు తెలుపుతూ.. భ‌గ‌వంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

ఎక్స్ లో ఉన్న ఈ అన్ని ట్వీట్ ల‌ను ప‌రిశీలిస్తే…క‌విత ట్వీట్ మాత్రం పెద్ద ఎత్తున అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఉద‌యం 10.29 గంట‌ల‌కు చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. ల‌క్షా 26 వేల మంది ఈ ట్వీట్ ను చూశారు. వీరిలో ఎంతోమంది భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.

కుటుంబంతో క‌విత పూర్తిగా తెగ‌తెంపులు చేసుకుంద‌ని కొంత మంది, నాన్న అని కూడ సంబోధించ‌డం లేద‌ని కొంద‌రు, క‌నీసం గౌర‌వం, ఫోటో లేకుండా ట్వీట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని మ‌రికొంద‌రు నిల‌దీస్తున్నారు. క‌విత చేసిన ట్వీట్ కింద అభిప్రాయాల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. …… ఈ ట్వీట్ పై సోష‌ల్ మీడియాలో క‌విత సోష‌ల్ మీడియా టీం కు బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా టీంకు వార్ జ‌రుగుతోంది.

మొత్తం మీద కేసిఆర్ బ‌ర్త్ డే పై క‌విత చేసిన ఒక్క ట్వీట్ తీవ్ర‌ చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *