
బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలకు అనుకూలంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యాఖ్యానించారు. 23 ఏళ్ల క్రితం బయో ఏషియా సదస్సు ఇక్కడ ప్రారంభం అయినప్పుడు పెద్దగా వసతులు లేవని, కానీనేడు ఆ పరిస్థితి లేదన్నారు. హైటెక్స్ లో బయో ఏషియా సదస్సును ప్రారంభించిన సీఎం అనంతరం ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ లో ఉన్న వసతులు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, పరిశోధన, డిజైన్ వంటి అంశాలు జీసీసీ ల ఏర్పాటుకు ఎంతో సహకారం అందిస్తాయన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో ₹73,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు “వన్-బయో”ను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఫార్మా సిటీని వేగ వంతం చేస్తామని చెప్పారు.

ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంతో అభివృద్ధి దిశలో రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్నధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ను ప్రకటించిందని, 2034 నాటి ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. బల్క్ డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు,తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. మేము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదు ,ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని చెప్పారు. తెలంగాణా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సీఎం బయో ఏషియా సదస్సులో పిలుపునిచ్చారు.





Leave a Reply