NewsInn

News in a Click

మ‌హాన‌గ‌రంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీఠ‌….!

పుర‌పాల‌క శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ మ‌హాన‌గారాన్ని మూడు మున్సిప‌ల్ కార్పోరేష‌న్లుగా విభ‌జించ‌డంతో మూడు కార్పోరేష‌న్ల ప‌రిధిలో
ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాను ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌కు వ‌స్తాన‌ని… ఎక్క‌డైనా చెత్త క‌న‌ప‌డితే స‌హించ‌మ‌ని అధికారుల‌ను సీఎం హెచ్చ‌రించారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి న‌గ‌ర పాల‌క సంస్థ‌ల క‌మిష‌న‌ర్లు తెల్ల‌వారుజామున ఆరు గంట‌ల‌కే క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ ర‌కాల‌ బోర్డులు క‌నిపిస్తున్నా ఆశించిన ఆదాయం రాక‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ముంబ‌యి, అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూర్‌ల్లోని ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో న‌గ‌రంలో వ‌స్తున్న ఆదాయాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌క‌ట‌న‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో వీధి దీపాల నిర్వ‌హ‌ణ విషయంలో యూనికోడ్ సిస్ట‌మ్ అనుస‌రించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

కొత్త చైర్మ‌న్ల‌కు ఒక రోజు శిక్ష‌ణ‌…

రాష్ట్రంలో నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు.. ఛైర్మ‌న్లు, డిప్యూటీ ఛైర్మ‌న్ల‌తో త్వ‌ర‌లోనే ఒక్క రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల అభివృద్దికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు.. ఇత‌ర అంశాల‌ను వివ‌రించాల‌ని సూచించారు. తాను స‌మావేశానికి హాజ‌రై నూత‌నంగా ఎన్నికైన వారితో మాట్లాడాతాన‌ని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *