NewsInn

News in a Click

ముంబాయికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మూడు రోజుల స‌ద‌స్సుకు హాజ‌రు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో మూడు రోజుల పాటు జ‌రిగే ముంబై క్లైమెట్ వీక్ లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముంబాయికి వెళ్లారు. మ‌హారాష్ట్ర సీఎం దేవంద్ర ఫ‌డ్న‌వీస్ ఆహ్వానం మేర‌కు సీఎం ఈ స‌ద‌స్సుకు హాజ‌రువుతున్న‌ట్లు సీఎంఓ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.రేపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి, హైద‌రాబాద్ ప్ర‌గ‌తి, ప‌రిపాల‌న సంబంధిత అంశాల్లో రాష్ట్రం సాధించిన పురోగ‌తిని సీఎం స‌ద‌స్సులో వివ‌రించ‌నున్నారు. మంగ‌ళ‌వారం ఈ స‌దస్సును ప్ర‌ధాని మోడీ ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. ముంబై క్లైమేట్ వీక్ పేరుతో మ‌హా రాష్ట్ర ప్ర‌భుత్వం, ముంబై కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ స‌ద‌స్సు ను నిర్వ‌హిస్తోంది.బంద్రా కుర్లా కాంప్లెక్స లోని జియో క‌న్వ‌న్ష‌న్ సెంట‌ర్ లో ఈ స‌ద‌స్సు జ‌రుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *