
బ్లాక్ బాక్ విశ్లేషణలు ఏమయ్యాయి
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
గత నెల చివరి వారంలో అనూహ్యంగా విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కీలక నేతలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ ఈ అంశాన్ని లేవనేత్తారు. ఆ తరువాత మరికొంత మంది నేతలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. వారం రోజుల క్రితం పవార్ కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఇదే అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించారు విమాన ప్రమాదంపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని చెప్పారు. తాజాగా ఎన్సీపీ నేతల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చింది.

సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ సహా పలువరు మంత్రులు,నేతలు ఉన్నారు. ఎన్సీపీకి చెందిన కీలక నేత రూపాలి థాంబ్రే విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ విశ్లేషణను బయట పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన 20 రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడాన్ని ఆమె తప్పు బట్టారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణను మహారాష్ట్ర ప్రజలకు తెలియచేయాల్సిన అవసర ఉందన్నారు.






Leave a Reply