7 వికెట్ల తేడాతో నేపాల్ విజయం
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచ కప్ లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. నేపాల్- స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠకు దారి తీసింది. ఈ పోరులో నేపాల్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించి స్కాట్లాండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్ భారీ స్కోరు ఛేదన లక్ష్యంగా దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. జట్టు ఓపెనర్లు కుషల్ భూర్టెల్, ఆసీఫ్ షేక్ లు తొలి వికెట్ కు శుభారంభాన్ని ఇచ్చారు.9 ఓవర్లలో 74 పరుగులు చేసిన తరువాత తొలి వికెట్ రూపంలో కుషల్ భూర్టెల్ 35 బంతుల్లో 4 సిక్స్ లు 1 ఫోర్ సహాయంతో43 పరుగులు చేసి ఔటయ్యారు.

12 ఓవర్ లో నేపాల్ జట్టు స్కోరు 87 పరుగులకు చేరుకోవడంతో మరో వికెట్ ఓపెనర్ ఆసీఫ్ షేక్ వికెట్ ను నేపాల్ కోల్పోయింది. 12 ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయిన నేపాల్ ఇక విజయం కష్ట సాధ్యమే అని అనిపించింది. ఆ వెంటనే రోహిత్ పౌడెల్ కూడా ఔటయ్యారు. దీంతో స్కాట్లండ్ విజయంపై భారీగా ఆశలు పెరిగాయి. కానీ ఆ తరువాత ఆట స్వరూపమే మారి పోయింది.దీపేందర్ సింగ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకు పడి 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. గుల్షాన్ ఝా నుంచి మంచి సహకారం లభించడంతో నేపల్ మరో నాలుగు బంతులు ఉండగానే స్కాట్లండ్ పై నేపాల్ విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్ లాండ్ నేపాల్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. మైఖెల్ జోన్స్ 45 బంతులు ఎదుర్కొని 71 పరుగులు సాధించారు( 8 ఫోర్లు 3 సిక్స్ లు) , జార్జ్ మున్సే 29 బంతుల్లో 27 పరుగులు చేశారు. పది ఓవర్లలోనే ఓపెనర్లు భారీగా 80 పరుగులు రాబట్టుకున్నారు. 10 ఓవర్ చివరి బంతికి జార్జ్ మున్సే రూపంలో స్కాట్ లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ భాగస్వామ్యం 15.2 ఓవర్ల వరకు వెళ్లింది స్కోరు 132 పరుగులకు చేరుకున్న తరువాత రెండో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వరుసగా స్కాట్లాండ్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్లు కోల్పోయి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నేపాల్ బౌలర్లలో సంపల్ కామి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు.





Leave a Reply