నేడు సాయంత్రం 7 గంటలకు మోడీ స్టేడియంలో మ్యాచ్
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 క్రికెట్ వరల్డ్ గ్రూపు దశ పోటీలు ముగియనున్నాయి. పసికూనలుగా ప్రపంచ కప్ లో పాల్గొన్న జట్లు సానుకూల ఫలితాలు సాధించకపోయినా….తమ ఆటతీరుతో క్రీడాభిమానుల అభిమానాన్ని దోచుకున్నాయి. ఇప్పటికే సూపర్ 8 లోకి ప్రవేశించిన భారత జట్టు ఈ రోజు నెదర్లండ్స్ లో గ్రూపు దశలో చివరి మ్యాచ్ ఆడనుంది. సూపర్ 8 బర్త్ ఖరారు కావడంతో…. ఈ మ్యాచ్ ను భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ గానే భావించే అవకాశం కనిపిస్తోంది. జట్టులో స్థానం దక్కినా ఆడేందుకు అవకాశం దక్కని ఆటగాళ్లను ఈ మ్యాచ్ భారత జట్టులో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.సాయంత్రం 7 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.

రెండు జట్లకు ఇది చివరి లీగ్ దశ మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య ఒక్క టీ20 మ్యాచ్ జరిగింది. 2022 ప్రపంచ కప్ లో భారత జట్టుతో నెదర్లాండ్ తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రోజు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే…భారత జట్టు పరుగుల వరద పారించే అవకాశం కనిపిస్తోంది. భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు టీ-20 ప్రపంచ కప్ లో ఇద్దరు ఒకే మ్యాచ్ లో రాణించిన సందర్బాలు లేవు….కానీ ఈ మ్యాచ్ లో పసికూన లాంటి నెదర్లాండ్ జట్టుతో ఈ ఇద్దరు బ్యాట్సమెన్లు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించే చాన్స్ ఉంది. నెదర్లాండ్ జట్టుతో ఆడిన అనుభవం భారత జట్టులో నలుగురు ఆటగాళ్లకు మాత్రమే ఉంది. మిగిలిన వారు అంతా మొదటి సారి ఆ జట్టుతో ఆడుతున్న ఆటగాళ్లే కావడం విశేషం.

తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లు…..
భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మాత్రమే నెదర్లాండ్స్తో టీ20 మ్యాచ్ ఆడారు. ఏడుగురు ఆటగాళ్లు నెదర్లాండ్స్తో తమ తొలి టీ20 మ్యాచ్ తొలిసారి ఆడనున్నారు. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత జట్టు…..
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్, వాషింగ్టన్.
నెదర్లాండ్స్ జట్టు……
స్కాట్ ఎడ్వర్డ్స్ (వికెట్ కీపర్/కెప్టెన్), మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్మాన్, జాక్ లియోన్-కాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లెయిన్, సక్ పాల్ క్లెయిన్, ఫ్రెడ్ క్లాస్, ఫ్రెడ్ క్లాస్, వాన్ మీకెరెన్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్.
భారత జట్టు చివరి మ్యాచల్ లో చిరకా ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై భారీ విజయాన్ని నమోదు చేసుకుని జోష్ లో ఉంది.








Leave a Reply