
- రాజేంద్రనగర్ లో వేలం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన లభించింది. ఇక్కడి 14 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు ఈ నెల 2 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా బుధవారం నాడు నిర్వహించిన వేలం పాటలో 49 మంది కొనుగోలుదారులు పాల్గొరంరాకె, ప్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈ భూముల చదరపు గజానికి రూ. 32 వేల కనీస ధరగా నిర్ధారించగా, వేలం పాటలో గరిష్టంగా చదరపు గజం రూ.51 వేలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం ఒక తెలిపారు. ఈ 14 ప్లాట్ల విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. రెండు నెలల క్రితం గచ్చిబౌలి సహా ఇతర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలానికి అనూహ్య స్పందన లభించింది.
-రాజేంద్రనగర్ లక్ష్మిగూడలో చదరపు గజం రూ.51 వేలు
-హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం
-మొత్తం విక్రయించిన ప్లాట్లు 14
-అప్సెట్ ధర: చదరపు గజానికి ₹32,000
-అత్యధిక బిడ్: చదరపు గజానికి ₹51,000
-కనిష్ట బిడ్: చదరపు గజానికి ₹36,000
-సగటు బిడ్: చదరపు గజానికి ₹44,285





Leave a Reply