-బీఆర్ ఎస్ నేతల సీరియస్
(ఆదిలాబాద్,న్యూస్ఇన్)
గత మూడు రోజులుగా క్యాతన్ పల్లి మున్సిపాల్టీలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ హాట్ గా మారాయి. మంత్రి వివేక్ ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండడంతోమున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు సుమన్, వివేక్ నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల కు ముందు నుంచి పోటీ పడుతున్నారు.


ఈ మున్సిపాల్టీలో మొత్తం 22 కౌన్సిలర్ స్థానాలు ఉండగా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 14 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను దక్కించుకుంది. అయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్బంగా అక్కడ ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి. కాంగ్రెస్, బీఆర్ ఎస్ వర్గాలకు చెందిన నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో కీలక నేతల వాహనాలు ధ్వంసం కూడా అయ్యాయి. అయితే 18వ తేదీన మరోసారి జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూమం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.



ఇక అధికార పార్టీ అండగా నిలుస్తూ వస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే పోలీసులు బుధవారం ఉదయం నుంచే సుమన్ అరెస్టు చేయడంపై దృష్టి పెట్టారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే సుమన్ ను ఆయన ఇంటి నుంచి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు .అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమన్ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు ఒకే సారి సుమన్నివాసంలోకి ప్రవేశించి అరెస్టు చేయడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమన్ అరెస్టు అక్రమంటూ బీఆర్ ఎస్ నేతలు ఆందోళనలు చేయడంతోవారిని చెదరగొట్టి పోలీసులు సుమన్ సహా నేతలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, పార్టీ డిప్యూటీ ఫోర్ లీడర్ హరీష్ లు ఘాటుగా స్పందించారు. ప్రజా స్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సుమన్ పై అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. రాష్టరంలోని తొర్రూరు, జనగామ,జహీరాబాద్ లలో జరిగిన ఘటనలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్య పెడుతోందని హరీష్ రావ్ ఏఐసీసీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్ లతో పాటు ఏఐసీసీ కీలక నేతలకు లేఖ రాశారు. బీఆర్ ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చినా ఆ మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో వివరించారు.
మూడు రోజుల క్రితం తాండురు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేసే యత్నం చేయడంతో ఆయన నివాసంలో లేకపోవడంతో అక్కడా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారు. ఈ రోజు మరో మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి తో పాటు ఆయన తనయుడిపైనా కేసు నమోదు చేశారు.







Leave a Reply