- టాప్ ఆర్డర్ విఫలం శివాలెత్తిన శివం దూబె
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచకప్ లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బయటపడింది. పసికూన లాంటి జట్టు నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోకూడా భారత టాప్ ఆర్డర్ ఆశించినంత రాణించలేదు. టాస్ గెలిచి భారీ స్కోరును నెదర్లాండ్స్ జట్టు ముందు ఉంచాలని భావించిన భారత్ కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. 20 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. టీ-20 స్టార్ బ్యాట్స్ మెన్ తన జీరో స్కోరు పరంపరను ఈ మ్యాచ్ లోనూ కొనసాగించారు. ఆనంతరం ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు ఆచి తూచి ఆడుతూ వచ్చారు. ఇషాన్ కిషన్ బ్యాట్ తో మంచి టచ్ లో కనిపించినా…దురదృష్ట వశాత్తు ఔటయ్యారు.ఇషాన్ 7 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, 1సిక్స్ సహాయంతో 18 పరుగులు చేసి వెనుదిరిగారు.

అప్పటికీ భారత జట్టు స్కోరు 4.2 ఓవర్లలో 39 పరుగులు మాత్రమే ఆ తరువాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లో స్కోరు బోర్డును ముందుకు తీసుకెల్లే యత్నంలో మరో 30 పరుగులు మాత్రమే జోడించగలిగారు జట్టు స్కోరు 69 పరుగుల వద్ద 3వ వికెట్ భారత్ కోల్పోయింది. ఆ తరువత బ్యాటింగ్ కు వచ్చిన శివం దుబే నెదర్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు అవకాశం ఉన్న ప్రతి బంతిని బౌండరీ దాటించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సూర్య కూడా తన దైన స్టైల్లో దూకుడు పెంచేందుకు ప్రయత్నించి ఔటయ్యారు. సూర్య కుమార్ 28 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేశారు. ఇందులో 2 ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉంది.

మరోవైపు శివం దూబె నెదర్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. దుబూ 31 బంతులను మాత్రమే ఎదుర్కొని 66 పరుగులు చేశారు. ( 6 సిక్సర్లు, 4 ఫోర్లు) తో దుబే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దుబేకు హర్దిక్ పాండ్య తోడు కావడంతో చివరి ఓవర్లలో భారత జట్టు స్కోరు పెరుగుతూ వచ్చింది. 19.2 ఓవర్లలో 186 పరుగల వద్ద దుబే ఔటయ్యారు. ఆ వెంటనే హర్దిక్ పాండ్య కూడా 193 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్నారు. చివర్లో భారీ షాట్లు ఆడేందుకు వెల్లి ఈ ఇద్దరు ఔటయ్యారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 193 పరుగులకు చేరుకుంది. రింకూ సింగ్ ఆరు పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అభిషేక్ శర్మ ఫాం జట్టు యాజమన్యాన్ని ఆందోళన కలిగించే విధంగా మారింది.







Leave a Reply