NewsInn

News in a Click

తాజ్ బంజారా ను సొంతం చేసుకున్న అరబిందో గ్రూప్

(హైదరాబాద్, న్యూస్ ఇన్)

హైదరాబాద్ లో అరబిందో బోరి పెట్టుబడితో తాజ్ బంజారా హోటల్ ను సొంతం చేసుకుంది.
అరబిందో గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్ విభాగం ఆరో రియాలిటీ, హైదరాబాద్‌లోని ల్యాండ్‌మార్క్ హోటల్ గా గుర్తింపు ఉన్న తాజ్ బంజారా ఆస్తిని ₹315 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రాప్‌స్టాక్ తెలిపింది.

ఈ భవనం బంజారా హిల్స్‌లో 16645 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఉంది.
నిర్మాణ ప్రాంతం 1.2 లక్షల చదరపు అడుగులు గా ఉంది. దీనిని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు స్టాంప్ డ్యూటీ ₹17.3 కోట్లు చెల్లించింది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో…. ఈ బారీ డీల్ రియల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *