నోటిఫికేషన్ విడుదలతో మరోసారి ఆందోళన
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టబోతుంది. గతంలోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తెరపైకి వచ్చి మార్కింగ్ చేసిన సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది. తాజాగా పది రోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు నిరసనలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరు నాటికి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్బంగా కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. అందుకు అనగు ణంగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలో మీటర్ల దూరంలో మూసీ పరివాహక ప్రాంతాన్ని అత్యంత సుందరీకరించి కాలుష్యాన్ని నివారిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పరివాహక ప్రాంతాల్లోని నివాసలకు గతంలోనే అధికారులు మార్కింగ్ చేయడంతో ఇప్పుడు ఆ తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని బాపు ఘాట్ దగ్గర ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నెలాఖరులోపే ఈ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. మూసీకి అనుకుని ఉన్న ఓ భారీ ఆపార్ట్ మెంట్ కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఫిబ్రవరి 9-10, 2026న భూ సేకరణ నోటిఫికేషన్ను జారీ చేసింది

నోటిఫికేషన్ వివరాలు….
ఈ నోటిఫికేషన్ ఫేజ్ 1A (హిమాయత్సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు) మరియు ఫేజ్ 1B (ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్, బాపు ఘాట్తో సహా) లోని భూ యజమానులను TDR,MFL తో పాటు 50 మీటర్ల బఫర్ జోన్లలో స్వచ్ఛందంగా భూములను అప్పగించాలని కోరింది. గండిపేట నుండి గౌరెల్లీ వరకు 55 కి.మీ. విస్తరించి ఉంది, పర్యావరణాన్ని కాపాడడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్ణయించుకుంది. పరిహారం విషయంలోకూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్ణయం తీసుకుంది.
మూసీ పరివాహక ప్రాంతాలు….

ఇది ఫేజ్ 1A (హిమాయత్సాగర్ నుండి గాంధీ సరోవర్/బాపు ఘాట్ వరకు 9.2 కి.మీ., ఫేజ్ 1B (ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 11.3 కి.మీ) ఉంటుంది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని 14 మండలాల్లోని 46 గ్రామాలను విస్తరించి ఉంది. దర్గా కలీజ్ ఖాన్, కిస్మత్పూర్, హైదర్గూడ, బండ్లగూడ జాగీర్, బుద్వేల్, ఉప్పర్పల్లి, గండిపేట, నార్సింగి, మంచిరేవుల, ఇబ్రహీంబాగ్, ఖిలా మొహమ్మద్ నగర్, గంధంగూడ. హైదర్షాకోట్ లు ఉన్నాయి. కిస్మత్పూర్, బండ్లగూడ జాగీర్ గ్రామాల్లోనే సగం భూసేకరణ చేయాల్సి ఉంటుంది.
వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంతులకు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆహ్వానాలు అందించారు. దీంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునరావసర చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుందన్న సంకేతాలు ఇచ్చింది.









Leave a Reply