17 పరుగులతో తేడాతో భారత్ విజయం
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
గ్రూపు దశలో చివరి మ్యాచ్ అడుతున్న భారత్, నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో ప్రపంచ అగ్రశేణి జట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు తో పోరాడి ఓటమి చెందింది. పసికూన జట్లుగా ప్రపంచ కప్ లో ఎంటర్ అయిన చిన్న దేశాలు ఈ విడత టీ-20 ప్రపంచ కప్ లో అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ 8లోకి ప్రవేశించిన భారత జట్టు ఈ మ్యాచ్ ను పెద్దగా సీరియస్ గా తీసుకోనట్లే కనిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు వికెట్లు కోల్పోతూనే శివం దూబె, హర్ధిక్ పాండ్యల బ్యాటింగ్ లో మంచి స్కోరు సాధించింది. దుబే 31 బంతుల్లో 66 పరుగులు చేయగా, హర్దిక్ పాండ్య 21 బాల్స్ ఎదుర్కొని 31 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 193 పరుగులకు చేరుకుంది.

194 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్ ఓపెనర్లు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. పరుగులు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా 5 ఓవర్లలో స్కోరును 35 పరుగులకు చేర్చారు. ఆ తరువాత తొలివికెట్ భారత్ కు దక్కింది. ఆ తరువాత మరో 17 పరుగులకు మరో వికెట్ నెదర్లాండ్ కోల్పోయింది. అయినా భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొనే యత్నం నెదర్లాండ్స్ బ్యాట్సెమెన్లు చేశారు. 3వ వికెట్ భాగస్వామ్యానికి 12 ఓవర్లలో 94 పరుగులకు స్కోరు చేరుకుంది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ రావడంతోనే నెదర్లాండ్స్ కు కష్టాలు మొదలయ్యాయి. వరుణ్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయినా మ్యాచ్ పై ఆశలు వదులు కోకుండా నెదర్లాండ్స్ బ్యాటర్లు పోరాటం చేస్తూ వచ్చారు. ఆ జట్టులో బాస్ డీ లీడ్ 23 బంతులను ఎదుర్కొని 33 పరుగులు చేశారు.ఆ జట్టులో అత్యధిక స్కోరు ఇదే అయన్ దత్ మినహా మిగిలిన బ్యాటర్లు అంతా డబుల్ డిజిట్ పరుగులు చేయడంతో నెదర్లాండ్ భారత్ తో పోరాటం చేస్తూ వచ్చింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. మొదటి నుంచి నెదర్లాండ్ గెలువదని అంతా అంచనా వేసినా….పసికూన లాంటి ఆ జట్టు భారత్ ను కట్టడి చేయడంతో భారత బౌలర్లను ఎదుర్కొని 176 పరుగులు సాధించడం విశేషం. శివందూబె బౌలింగ్ లో కూడా రాణించి 2 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ లో మరోసారి భారత స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ నిరాషపరిచారు.








Leave a Reply