(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ విమన ప్రమాదంలో మృతి చెందడంపై వివాదం రాజుకుంటుంది. నిన్న మొన్నటి వరకు పవార్ మృతి ఘటనపై విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అజీత్ పవార్ సతీమని మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ ఈ ఘటనను సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ కు వినతిపత్రం ఇచ్చారు. పవార్ కుటుంబ సభ్యుడైన ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసినా…. తాజాగా మరో అడుగు ముందుకు వెశారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిన ఘటన కాదని స్పష్టం చేశారు. ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని ఆరోపించారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతోంది.

బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్న ఎన్సీపీ, ఎన్డీఏలో భాగస్వామ్యం గా ఉన్న మరో పార్టీ కేంద్ర మంత్రి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వీఎస్ ఆర్ విమానయాన సంస్థ యజమాని రోహిత్ సింగ్ కు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రోహిత్ సింగ్ సంబంధాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూడకండా చూస్తున్నారని రోహిత్ ఆరోపించారు.ఈ ఘటనపై నిష్ఫాక్షింగా దర్యాప్తు జరుగాలంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును తప్పించాలని డిమాండ్ చేశారు. 35 కోట్ల రుపాయల విలువ చేసే విమానానికి రూ.210 కోట్ల బీమా వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రమాద సమయంలో ఫ్లైట్ లోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారన్నారు. ఈ ఘటనపై విచారన పూర్తి కాక ముందు రోహిత్ సింగ్ ను దేశం విడిచి వెళ్లేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. కేసులో సాక్ష్యాలను తారు మారు చేసే యత్నం జరుగుతోందని రోహిత్ పవార్ ఆరోపించారు.











Leave a Reply