82 పరుగులతో తేడాతో విజయం
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నారు. గురువారం జరిగిన అఫ్లానిస్తాన్, కెనడా జట్ల జరిగిన మ్యాచ్ లో అఫ్గాన్ సునాయసంగా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్లాన్ జట్టు కెనడా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 200 పరుగుల చేసింది. అఫ్గాన్ బ్యాటర్లు కెనడా బౌలర్ల పై తొలి ఓవర్ నుంచే విరుచుకు పడ్డారు. తొలివికెట్ కు రహమనుల్లా, ఇబ్రహీం జోర్డాన్ లు కెనడా బౌలర్లను ఏమాత్రం ఇబ్బంది లేకుడా ఎదుర్కొన్నారు. 5.3 ఓవర్లలో 47పరుగులు అఫ్గాన్ సాధించింది. ఆ స్కోరు దగ్గర రహమనుల్లా గుర్జాజ్20 బంతుల్లో30 పరుగులు చేసి ఔటయ్యారు. బ్యాటింగ్ వచ్చిన గుల్బాదీన్ నయీబ్ కేవలం ఒక్క పరుగు సాధించి వెనుదిరిగారు. మరో ఎండ్ లోఉన్న ఇబ్రహీం జర్దాన్ కెనాడా బౌలర్లపై విరుచుకు పడ్డారు. కేవలం 56 బంతులు ఎదుర్కొని 95 పరుగులు చేశారు. 7 ఫోర్లు 5 సిక్స్ ల సహాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

మరో వైపు నుంచి జర్దన్ కు అండగా బ్యాటర్లు వ్యవహరించడంతో అఫ్గాన్ భారీ స్కోరును సులువుగా చేరుకుంది. సిద్ధిఖుల్లా 32 బంతుల్లో44 పరగులు చేశారు. అజ్మత్తుల్లా ఓమర్జాయ్ 13 పరుగులు చేశారు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి అఫ్గాన్ 200 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత 201 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన కెనడా ఎక్కడా అఫ్గాన్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొలేకపోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అఫ్గన్ స్పిన్నర్లు కెనడాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో విజయవంతం అయ్యారు. కెనడా జట్టులో హర్షిత్ 24 బంతుల్లో 30 పరుగులు చేసారు ఇదే కెనడా జట్టు బ్యాటర్లలో అత్యధిక స్కోరు. అఫ్గన్ బౌలర్ మహ్మద్ నబీ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 7 పరగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ తన కోటాలో 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. 201 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేలా కెనడా జట్టు ముందు నుంచి కూడా కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే కెనడా జట్టు చేయగలిగింది
లీగ్ దశలో మ్యాచ్ లు ముగింపు దశకు చేరుకోవడంతో భారత్ టాప్ఆర్డర్ ఆందోళన కలిగిస్తోంది.












Leave a Reply