హాజరు కానున్న రాహూల్ గాంధీ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు వికారాబాద్ అనంతగిరి హరిత రిసార్ట్ లో శిక్షణా తరగతులు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శనివారం నుంచి మొదలయ్యే ఈ తరగతులు 10 రోజుల పాటు నిర్వహించాలని పార్టీ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇటీవల తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై పలువురు వక్తలు డీసీస అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా ఈ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 26, 27 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాంధీ కూడా శిక్షణా తరగతుల సందర్బంగా డీసీసీ అధ్యక్షులను కలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ శిక్షణా శిబిరాలకు హాజరు కానున్నారు. 10 రోజులు ఇక్కడే ఉండేలా అన్ని ఏర్పాట్లను పార్టీచేస్తోంది.

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా శిక్షణా తరుగతులకు హాజరు అవుతున్నట్లు సమచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు శిక్షణా శిబిరాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. శిబిరాల ప్రారంభోత్సవం లేదంటే ముగింపు తో పాటు రాహూల్ గాంధీ హాజరయ్యే రోజు సీ ఎం కాంగ్రెస్ పార్టీ శిక్షణా శిబిరానికి హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతంపై నేతలకు ప్రధానంగా శిక్షణ తరగుతలు నిర్వహించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఫోకస్ పెట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణా ఆవిర్భావం తరువాత పదేళ్లకు తెలంగాణాలో పార్టీ అధికారం దక్కించకున్నా…ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటుంది. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాలేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ బోణినే చేయలేదు. రాబోయే రోజుల్లో రాజకీయంగా జరుగబోయే మార్పులు, పార్టీ విధానాలతో పాటు పార్టీని తెలుగురాష్ట్రాల్లో మరింత బలోపేతం చేయాలన్న అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.







Leave a Reply