NewsInn

News in a Click

తెలంగాణాను ముంచెత్త‌నున్న వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో రెండు,మూడురోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నెల 22 నుంచి 24 వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే చాన్స్ ఉంద‌ని అంచ‌నా వేసింది. మార్చి, ఏప్రిల్ నెల‌లో సాధార‌ణంగా అకాల వ‌ర్షాలు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు స‌హ‌జ‌సంగా వ‌స్తుంటాయి. కానీ ఫిబ్రవ‌రి నెల చివ‌రి వారంలోనే ఈ సారి తెలంగాణాపై అకాల వ‌ర్షాల ప్ర‌భావం ప‌డ‌నుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిద ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి భారీ వ‌ర్షాలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. కొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 40 మి.మీ వ‌ర్ష పాతం న‌మోదయ్యే చాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్నాయి. చ‌లి కాలం మాదిరిగా ఉద‌యం వేళ‌ల‌లో చ‌లి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. సాయంత్రం చ‌ల్ల‌టి గాలుల ప్ర‌భావం ఉంది. అకాల వ‌ర్షాల అనంత‌రం వేస‌వి తాపం పెరిగే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *