NewsInn

News in a Click

జీవ‌న్ రెడ్డికి గౌర‌వం ఇవ్వాలి : జ‌గ్గారెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డికి పార్టీ త‌గిన గౌర‌వం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందిన టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా….ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న‌కు ఉన్న రాజ‌కీయ అనుభ‌వం దృష్ట్యా ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నేత‌గా ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని ఇదే విష‌యాన్ని పీసీసీ చీఫ్ కు , తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు కూడా తెలియ‌చేస్తాన‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ప‌రంగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించినా ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతోనే ఓడి పోయార‌ని ఇది రాజ‌కీయాల్లో స‌హ‌జ‌మ‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీకి ఎన్నో సేవ‌లు చేశార‌న్నారు. రాజ‌కీయంగా ఆయ‌న‌కు అవ‌కాశాలు వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీనే న‌మ్ముకుని ఉన్నార‌న్నారు. పార్టీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో ఆయ‌న అవమానాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, సీనియ‌ర్ల‌కు ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌కుండా హై క‌మాండ్ పెద్ద‌లు చొర‌వ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

రేప‌టి నుంచి వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్ష‌ణా శిబిరాలు…. హాజ‌రు కానున్న సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *