
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG-RERA) ప్రణీత్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్పై కొరడా ఝుళిపించింది. నగర శివారుల్లోని పుప్పాల్ గూడ ప్రాంతంలో ఈ కంపెనీ నిర్మిస్తున్న ఫ్లాట్ ల అమ్మకాల్లో నిబంధనలను అతిక్రమించిందని నిర్ధారించింది. ఈ ప్రాజెక్టులో A, C,D బ్లాకులకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించిందని, అయితే ప్రమోటర్ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే B, E, F మరియు G బ్లాకులతో పాటు అదనపు అంతస్తులకు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడంవిక్రయాలకు ఆఫర్ చేయడం అథారిటీ గుర్తించింది.ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద రూ. 43,71,211 జరిమానాను అథారిటీ విధించింది.
బాచుపల్లి లో…
మరొక ఉత్తర్వులో, బాచుపల్లిలోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యజమానుల బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని తెలంగాణ రెరా అథారిటీ తప్పుబట్టింది. అక్రమ ఆలస్య రుసుములను తొలగించి, సవరించిన ఖాతా వివరాలను (Revised Statements) అందించాలని పసిఫికా కన్ స్ట్రక్షన్ను ఆదేశించింది. మునుపటి కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రమోటర్ వేయలేరని తేల్చి చెప్పింది. అటువంటి ఛార్జీలను మినహాయించి, ఒప్పందాల ప్రకారం బకాయిలను లెక్కించి సవరించిన స్టేట్మెంట్లను సమర్పించాలని ప్రమోటర్ను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

తులసీ కన్స్ట్రక్షన్స్ పై…..
తులసి కన్స్ట్రక్షన్స్ మరియు భువంతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కు 30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని మరో కేసులో రేరా ఆదేశించింది. 30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. సూరారంలోని ‘తులసి లేక్ ఫ్రంట్’ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వి. సోల్మన్ రాజుకి 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పొసెషన్ అప్పగించాలని తులసి కన్ స్ట్రక్షన్స్ మరియు భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టును రెరా ఆదేశించింది. బాధితుడు 2020లోనే రూ.31 లక్షల పూర్తి విక్రయ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, బిల్డర్ (తులసి కన్ స్ట్రక్షన్స్) మరియు మార్కెటింగ్ ఏజెన్సీ (భువన తేజ ఇన్ఫ్రా) మధ్య ఉన్న అంతర్గత ఆర్థిక వివాదాల వల్ల గత రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ నిలిపివేశారు.
రాజా ఇన్ఫ్రా పైనా…..
సైదాబాద్ కాలనీలో రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన రాజా ఇన్ఫ్రా కన్ స్ట్రక్షన్స్ ప్రాజెక్టుపై కూడా కఠిన చర్యలు తీసుకుంది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయినప్పటికీ, 548.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టిన బిల్డర్ నిబంధనలను పాటించలేదని గుర్తించింది. భూ యజమానులు రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారం ఇవ్వలేదన్న బిల్డర్ వాదనను తోసిపుచ్చిన అథారిటీ, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ బాధ్యతను ఒప్పందాల ద్వారా తప్పించుకోలేరని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి విక్రయాలు, బుకింగ్లు లేదా ప్రచారాలు నిర్వహించకూడదని అథారిటీ నిషేధం విధించడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
భూముల ధరలు పెరగడమే కారణమా….



Leave a Reply