జార్ఖండ్లోని సాహిబ్గంజ్కు చెందిన ఒక యువకుడు, చైనాలోని హెబీకి చెందిన ఒక యువతి మరోసారి దీనిని నిరూపించారు. చైనా నివాసి జియావో జియావో తన భారతీయ ప్రేమికుడు చందన్ సింగ్ను వివాహం చేసుకోవడానికి సొంత కుటుంబాన్ని వదిలి.. భారత్లో అడుగుపెట్టింది. డిసెంబరు 6న వేద మంత్రాల నడుమ, వరుడి కుటుంబ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఆ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సాహిబ్గంజ్లోని వినాయక్ హోటల్లో వీరి వివాహం వైభవంగా జరిగింది. చందన్ సింగ్-జియావో జియావో గతంలో లండన్లో ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పట్లోనే వారి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాతి రోజులలో గాఢమైన ప్రేమగా మారింది. ఆ సమయంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే మాటను.. చందన్ తన తండ్రి.. శంభు శంకర్ సింగ్ వద్ద వ్యక్తపరచగా, ఆయన సంతోషంగా అంగీకరించారు. వివాహం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా చూసుకున్నారు. వినాయక్ హోటల్లో జరిగిన ఈ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద మంత్రాల మంత్రోచ్ఛారణల మధ్య, భారతీయ దుస్తులు ధరించిన జియావో జియావో, చందన్ సింగ్తో కలిసి ఏడు అడుగులు వేశారు. ఇది రెండు దేశాల సంస్కృతుల అద్భుతమైన, చిరస్మరణీయ కలయికగా మారింది. కాగా, నిజమైన ప్రేమ ముందు వేల కిలోమీటర్ల దూరం, సాంస్కృతిక భేదాలు పట్టింపు లేదని ఈ వివాహం రుజువు చేస్తుంది.
చైనా అమ్మాయి – ఝార్ఖండ్ అబ్బాయి






Leave a Reply