NewsInn

News in a Click

అగ్ని ప్ర‌మాదం… అనుమాన‌లే బ‌ల‌ప‌డుతున్నాయా..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

పోలీసుల కేసు విచార‌ణ‌లో కీల‌కంగా మారే సాక్యాధారాల విష‌యంలో రాష్ట్ర పోలీసుల‌కు పెద్ద స‌వాల్ ఎదుర‌య్యేలా క‌నిపిస్తోంది. గ‌త నెల‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంతో పోలీసులు సేక‌రించిన ఆధారాల‌న్నీ బూడిదైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క కేసుల‌ను విశ్లేశించి కేసుల విచార‌ణ‌కు సులువ‌గా ఉండేందుకు సాంకేతిక ఆధారాల‌ను అందించే ఫోరెన్సిక్ ప్ర‌మాదంలో దాదాపు 1100 కేసుల‌కు సంబంధించి పూర్తి ఆధారాలు ద‌గ్ధ‌మైంద‌ని సాంకేతిక నిపుణులు తేల్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ప్ర‌మాదంపై రాజ‌కీయంగా కూడా ఎన్నో అనుమానాలు ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యం నుంచి విప‌క్ష పార్టీల నేత‌ల అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. . అయితే పొలిటిక‌ల్ విమ‌ర్శ‌లు, కేసుల ప్రాధాన్య‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్ర‌మాదంపై నాగ్ పూర్ నుంచి నిపుణుల బృందాన్ని అధ్య‌య‌నంకోసం పిలిచారు. ఈ బృందం దాదాపు వారం రోజుల పాటు ఈ ప్ర‌మాదం, దాని ప‌రిణామాల‌పై పూర్తి స్థాయిలో ఆరా తీశారు.నాగ‌పూర్ నిపుణుల బృం ఈ ప్ర‌మాదం పై నివేదిక‌ను పోలీసు అధికారుల‌కు స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్ర‌మాదంలో దాదాపు 1100 ఫైల్స్ పూర్తిగా ద‌గ్ధ‌మైన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది.

ఈ కేసులో డేటా రిక‌వ‌రికీ య‌త్నాలు చేసినా అది సాధ్యం కాలేద‌ని అభిప్రాయం వ్య‌క్తంచేసిన‌ట్లు తెలుస్తోంది. అగ్ని ప్ర‌మాదంతో స‌ర్వ‌ర్లు, హార్డ్ డిస్క్ లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని, ఇక డేటా రిక‌వ‌రి దాదాపు అసాధ్య‌మే అని స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచం. దీంతో కోర్టు విచార‌ణ‌ల‌పై అగ్ని్ప్ర‌మాద ప్ర‌భావం పెద్ద ఎత్తున ప‌డ‌నుంది. నాగ్ పూర్ నిపుణుల బృందం ఇచ్చిన 11 వంద‌ల కేసుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అయితే ఈ నివేదిక ప్రాథ‌మికంగా ఇచ్చిన నివేదిక అని, మ‌రికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక‌ను నిపుణుల బృందం ప్ర‌భుత్వానికి ఇవ్వ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *