
తెలంగాణాకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదిలోపు దేశ వ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన స్వయం సహాయక బృందాల సమన్వయంపై జరిగిన సదస్సుకు హాజరయ్యారు.వచ్చే మూడేళ్లలో దేశ వ్యాప్తంగా షీ మార్ట్ లు ప్రారంభిస్తామన్నారు.

వీటిని అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రచారం కల్పిస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా మహిళలను లక్షాధికారులను చేసేందుకు అనుగుణంగా తాము కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే 3 కోట్ల మంది మహిళలు లక్షలాధికారులుగా మారారని, రాబోయే మూడేళ్లలో మరో 3 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల్లోని మహిళల అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తామన్నారు.
మహిళలు, సమాజ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణాపై ఎలాంటి తారతమ్య బేధాలను చూపించదన్నారు. కలిసి నడుద్దాం..2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా ఉమ్మడి నిర్ణయాలను అమలు చేద్దామని వ్యాఖ్యానించారు. బ్యాంకర్లు కూడా మహిళా సంఘాలకు రుణాలు గా భావించరాదని వారితో కలిసి పనిచేస్తున్నట్లు భావించాలని కేంద్ర మంత్రి సూచించారు. రుణాల పంపిణీని సులభతరం చేయడం, డిజిటల్ ఫైనాన్స్ అమలును ప్రోత్సహించడం,

గ్రామీణ మహిళల్లో ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రూపొదించింది.భారత ఆర్థిక సమ్మిళితత్వ ప్రయాణం ఇప్పుడు వ్యాపార ఆధారిత సాధికారతగా పరిణామం చెందాలనీ… ఆర్థిక వనరుల లభ్యత నుంచి ఉత్పాదక క్రెడిట్, వ్యాపారాలకు ప్రోత్సాహం, సుస్థిరమైన ఆర్థిక సామర్థ్యం వైపు దృష్టిని మళ్లించాలని డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ… తెలంగాణాలో మహిళల అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు.నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ లో నిర్మించిన క్షమతా భవన్ ను మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.


Leave a Reply