టీ-20 లో మందుకు వెళ్లాలంటే అధిగామించాలి
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు లీగ్ దశలో అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి సూపర్ 8కు చేరుకున్న అన్ని విభాగాల్లో ఆందోళన కనిపిస్తోంది. లీగ్ దశలో ఎక్కడా ఓటమి లేకుండా సూపర్ 8 కు చేరుకున్నా జట్టును ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఛాంపియన్ ఫెవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు అన్ని విభాగాల్లో ఎర్కొంటున్న సమస్యను అధిగమిస్తే తప్ప ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
బ్యాటింగ్ లో వెంటాడుతున్నసమస్యలు….

బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే జట్టు బ్యాటింగ్ కు అభిషేక్ శర్మ ఓపెనింగ్ పెద్ద బలం అని ముందు నుంచి భారతజట్టు భావిస్తోంది. కానీ ప్రపంచకప్ లో ఇప్పటి వరకు అభిషేక్ పరుగుల ఖాతా తెరవనే లేదు. నమీబియాతో మ్యాచ్ లో ఆడక పోగా మిగిలిన మ్యాచ్ లలో అభిషేకర్ స్కోరు మొదలు పెట్టకముందే పెవిలియన్ చేరుకున్నారు. అభిషేక్ తన బ్యాటింగ్ లో రాణిస్తే తప్ప ఓపెనింగ్ లో శుభారంభం దక్కే అవకాశం లేదు. 3, 4 స్థానాల సమస్య వెంటాడుతూనే ఉంది. కెప్టన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఆమెరికా మ్యాచ్ మినహా మిగితా మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ కీలక ఓవర్లలో బ్యాటింగ్ చేసేందుకు అవశం వస్తున్నా… ఎక్కువ బంతులు ఎదుర్కొంటూ పరుగులు తక్కువ చేస్తుండడం, ఆయన బ్యాటింగ్ లో రాణించకపోవడం జట్టుకు భారంగా మారింది. ఇక తరువాత శివం దుబె, హర్దిక్ పాండ్య, రింకూ సింగ్ ల వరకు అవకాశవం వస్తే రావచ్చు లేదంటే 20 ఓవర్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. శివం దూబె, పాండ్యలకు బ్యాటింగ్ చేసేందుకు అవకాశం వచ్చిన మ్యాచ్ లలో తమ మార్క్ వేసుకుంటున్నారు.భారత్ బ్యాటర్లు స్పిన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని పేరు మాత్రమే అని లీగ్ మ్యాచ్ లలో తేలిపోయింది. లీగ్ దశలో ప్రత్యర్థి స్పిన్నర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. భారత కీలక బ్యాట్సెమెన్లు స్పిన్ బౌలర్ల చేతిలో ఔటయ్యారు.
డెత్ ఓవర్లలో బౌలింగ్ భారం….

ఇక బౌలింగ్ విషయానికి వస్తే చివరిఓవర్లలో భారత జట్టు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించకుంటున్నారు. టీ-20 స్పెషలిస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందిన బూమ్రా సైతం పరుగులు ఇచ్చుకుంటున్నారు. హర్దిక్ పాండ్య ఆల్ రౌండర్ జట్టులో స్థానం నిలబెట్టుకుంటూ బౌలింగ్ లో కూడా వికెట్లు తీస్తున్నా పరుగులు చేయకుండా బ్యాట్స్ మెన్లను కట్టడి చేయలేకపోతున్నారు. నెదర్లాండ్స్ లాంటి పసి కూన జట్టుతో పోటీ పడుతున్నా చివరి నాలుగు ఓవర్లలో భారత జట్టు బౌలర్లు 51 పరుగులు సమర్పించుకున్నారు కేవలం ఒకే వికెట్ తీసుకున్నారు. ఇక పై జరిగే మ్యాచ్ లలో అన్ని బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో వీటిపై భారత జట్టు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఫీల్డింగ్ బలహీనతే…..

ఇక ఫీల్డింగ్ విషయంలో కూడా భారత జట్టు ఫిల్డీంగ్ లో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపులో ఫీల్డింగ్ కు కూడా అత్యంత ప్రాధన్యత ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో రెండు కు మించి క్యాచ్ లను జార వేస్తూ తమ స్థాయికి సరిపోయే ఫీల్డింగ్ ను భారత జట్టు గ్రౌండ్ లో చూపడం లేదని సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. లీగ్ దశలో ఈ సమస్యలు వెంటాడినా జట్టు విజయాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇకపై ఎక్కడ తప్పు జరిగిన భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
నేడు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు సూపర్ 8 లో భాగంగా తొలి మ్యాచ్ భారత జట్టు ఆడనుంది.





Leave a Reply