
(స్పోర్స్ డెస్క్,న్యూస్ఇన్)
భారీ అంచనాలతో టీ-20 ప్రపంచ కప్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్ శర్మ ఫాం….భారత జట్టును వేదిస్తోంది. ప్రపంచ కప్ లో అభిషేకర్ ఇప్పటి వరకు పరుగుల ఖాతానే తెరవలేదు. ఆయన ఫాం పై అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. కానీ భారత కెప్టన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి నమ్మకాన్ని ఆయనపై ఉంచారు. సాధారణంగా క్రికెట్ లో జరిగే ప్రక్రియ ఇదే అంటూ ఆయన అభిషేక్ గురించి మరింత ధీమా వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ ఆడకపోతేనే భారత జట్టు ప్రభావం ఇలా ఉందంటే అభిషేక్ ఆడితే ప్రత్యర్థులకు ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచించాలని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. ఈ ప్రపంచ్ కప్ లో ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లలో అభిషేక్ బ్యాటింగ్ లో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన విఫలమైన జట్టుగా మేము ఆ స్థానాన్ని కవర్ చేస్తామన్నారు.
అయితే అభిషేక్ శర్మ గత ఏడు ఇన్నింగ్స్ లో ఐదు సార్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ లో ఆర్ధశతకం సాధించారు. లీగ్ దశ పూర్తియన సందర్భంగా కీలక మ్యాచ్ లురాబోయే రోజుల్లో ఆడాల్సి ఉన్న భారత జట్టుకు అభిషేక్ రాణిస్తే మరింత భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా భారత జట్టులో తరువాతి స్థానాల్లో బ్యాటంట్ వచ్చే వారిపై వత్తిడి తగ్గి వారు కూడా బ్యాటింగ్ లో మంచి స్కోరు సాధించేందుకు చాన్స్ ఉంటుంది. ఈ ప్రభావం బౌలింగ్ బృందంపై కూడా ఉంటుంది. భారత జట్టు బౌలర్లకు భారీ స్కోరును కాపాడుకోవడం పెద్దగా సమస్య కాకపోవచ్చు.
అయితే భారత జట్టు సమిష్టిగా రాణించాలంటే మాత్రం అన్ని విభాగాల్లో సమర్ధవంతంగా తమ ప్రణాళికలను అమలు చేయల్సిన అవసరం ఉంది.





Leave a Reply