- 95 పరుగులకే కుప్పకూలిన లంక
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)

టీ-20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఆసీస్ జట్టుపై భారీ స్కోరును సులువుగా చేజ్ చేసి విజయం దక్కించుకున్న శ్రీలంగా సూపర్ 8 లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఏ దశలోనూ ఇంగ్లాండ్ స్కోరును ఛేజ్ చేస పరిస్థితిలో శ్రీలంక కనిపించలేదు.147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన లంక బ్యాటర్లు ఒక్కొక్కరు వెనుదిరిగారు.95 పరుగులకే లంక జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో లంకపై విజయం దక్కించుకుంది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తడబాటుతోనే ఇన్నింగ్స్ పూర్తి చేసింది. శ్రీలంక బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్లు కూడా ఇబ్బందులు పడ్డారు. ఓపెన్ ఫిల్ సాల్డ్ మాత్రం లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆ జట్టు చేసిన 146 పరగుల్లో సాల్డ్ 42 బంతులను ఎదుర్కొని 62 పరుగులు సాధించారు. ఆ తరువాత విల్ జాక్స్14 బంతుల్లో 21 పరుగుల సాధించారు. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లో ఇవే అత్యధిక పరుగులు కావడం విశేషం. మిగిలిన బ్యాటర్లు 7,3,6,11,6,10,0 పరుగలు సాధించారు. దీంతో శ్రీలంక ఈ మ్యాచ్ లో విజయావకాశాలను పెంచుకుంది. లంక బౌలర్లలో విల్లా లగే 3, మహీష్ తీక్షణ2, మధు శంక 2 వికెట్లు తీసుకన్నారు. లంక ఇన్నింగ్స్ ఒపెనింగ్ నుంచి తడబడుతూనే బ్యాటింగ్ మొదలు పెట్టింది. 15 పరగుల వద్ద తొలికెట్ కోల్పోయింది. ఆసీస్ మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన పాతూం నిసాంక 9 పరుగులు చేసి వెనుదిరగడంతో లంక వికెట్ల పతనం మొదలైంది.

ఆ తరువాత 20 పరుగల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 22 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూడా పడింది. ఆ తరువాత ఆచి తూచి ఆడడంతో మరో పది పరుగులను లంక బ్యాటర్లు జోడింది. 34 పరుగులకు చేరుకోవడంతో 5వ వికెట్ రూపంలో దెనీత్ వెల్లలగే ఔటయ్యారు. మరో 18 పరుగులు జోడించి కమీందు మెండిస్ పెవిలియన్ చేరుకున్నారు. దీంతో 13వ ఓవర్ వరకు 69 పరుగులు సాధించి 7 వికెట్లను లంక కోల్పోయింది. విల్ జాక్స్ తన కోటాలో అన్నీ ఓవర్లు బౌల్ చేసి మూడు వికెట్లు తీసుకున్నారు. ఆర్చర్ రెండు వికెట్లు తీసుకున్నారు.లంక బ్యాటర్లలో దాసున్ శనక 24 బాల్స్ఎదుర్కొని 30 పరుగులు చేశారు. ఇదే లంక తరపున బ్యాటింగ్ లో అత్యధిక స్కోరు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరును దాటలేకపోయారు. ఆడిల్ రషీద్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు.
సూపర్ 8 తొలి మ్యాచ్ ఏకపక్షం





Leave a Reply