కాళేశ్వరంను గాలికి వదిలేయం
సీఎం రేవంత్ రెడ్డి
(వరంగల్,న్యూస్ఇన్)
రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఉన్నా…తమ ప్రభుత్వం నిధులకొరతను ఎదుర్కొంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అక్కడ నిర్వహించిన సమీక్షా సమావేశాంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఉత్తర తెలంగాణా అని జపం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మినహా గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు.కాళేశ్వరం ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిందని,ఈ ప్రాజెక్టును వృధాగా పోనివ్వమని సీఎం చెప్పారు. మరమ్మత్తుల కోసం నిపుణుల కమిటీని నియమించామని కమిటీ సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తామన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలో వరద జలాల్లో, నికర జలాల్లో హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో చిత్త శుద్ధితో ప్రాణహిత,ఎస్ ఆర్ ఎస్ పి,దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 967 టీఎంసీ వాటాను గత ప్రభుత్వం వినియోగించుకోవడం విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మినహా గోదావరి నదీ జలాల వినియోగంపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.దేవాదుల ఎత్తి పోతల పథకాన్ని సీఎం సందర్శించి అక్కడే సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ లోపు ఈ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ కోసం 600 కోట్ల రుపాయాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంచనాలకు ఆమోద ముద్ర వేస్తామని చెప్పారు. అన్ని సాగునీటి ప్రాజెక్టు లనిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం వెల్లడించారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళికలను సిద్ధం చేసి విలైనంత త్వరగా నివేదికను ఇవ్వాలని అధికారులకు సూచించారు.
మరోవైపు మూసీ ప్రక్షాళణ ప్రాజెక్టు వివాదంగా మారుతోంది.






Leave a Reply