- మాజీ మంత్రిహరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవాతారమెత్తి దోపిడి చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చి పెద్దలకు భూములు కట్టబెట్టే కుట్రను సీఎం రేవంత్ చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ లేదు. ఎఫ్ టిఎల్ తేలలేదు అయినా పేదల ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడం దేనికి సంకేతామని ప్రశ్నించారు.

ఏ చట్ట ప్రకారం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారని నిలదీశారు. ఆదివారం మూసీ ప్రాజెక్టు డెవలెప్మెంట్ ప్రాంతంలో బాధితులకు భరోసా కల్పిస్తూ హరీష్ రావ్ పర్యటించారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంతో హరీష్ సహా బీఆర్ ఎస్ నేతలు అక్కడికి వెళ్లి బాధితులతో మట్లాడారు. బీఆర్ ఎస్ కు ఈ ఆపార్ట్ మెంట్ కు దగ్గర సంబంధం ఉందన్నారు. తెలంగాణా విజన్ డాక్యుమెంట్ ఇక్కడే రూపొందించామన్నారు.

హైదరాబాద్ ఇమేజ్ పెంచే యత్నం కేసిఆర్ చేస్తే…. ప్రస్తుత సీఎం రేవంత్ హైదరాబాద్ ఇమేజ్ ను కూలుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెప్పే సీఎం రేవంత్ మెస్సీతో కోట్ల రుపాయాలు పెట్టి మ్యాచ్ కు, మిస్ వరల్డ్ పోటీలకు డబ్బులు ఎలా వచ్చాయన్నారు.మూసీ సందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చి వేతలకే తాము వ్యతిరేకమన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మూసీ బాధితుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావ్ అన్నారు. పేదల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.





Leave a Reply