NewsInn

News in a Click

డబుల్ ఇంజన్ సర్కార్ – డబుల్ స్పీడ్‌ అభివృద్ధి

డబుల్ ఇంజన్ సర్కార్ – డబుల్ స్పీడ్‌ అభివృద్ధి

ఏఐ స‌ద‌స్సులో కాంగ్రెస్ ప‌రువు తీసింది

సీఎం చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

దేశంలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థగా డాక్ సేవక్ లు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పెరిగినా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చినా డాక్ సేవక్ ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సీఎం స్పష్టం చేశారు.అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు సహకార ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి, డిజిటల్ కనెక్టివిటీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చక్కగా పని చేస్తున్నారని అభినందించారు.డిజిటల్ కనెక్టివిటీ ఉంటే ప్రజలకు సేవలు కూడా చాలా సులువుగా అందుతాయని చంద్ర‌బాబు అన్నారు.

రాష్ట్రంలో వాట్సాప్ ద్వారానే 900కు పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామ‌న్నారు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో.. ఇతర దేశాల కంటే భారత దేశం చాలా ముందుంది.ఏపీకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతోంది… విశాఖ నుంచి ఇతర దేశాలకు సబ్ సీ కేబుళ్ల ద్వారా డేటాను పంపే పరిస్థితి వస్తుంది.వచ్చే రెండు మూడేళ్లల్లో క్వాంటం కంప్యూటర్లను అమరావతి నుంచి ఉత్పత్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం ఏడాదిన్నరలో ఏపీలో ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలన్న ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని బాబు అన్నారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్సిల్ వెళ్లాలంటే డాక్ సేవకుల వల్లే సాధ్యం.భారతీయ తపాలా శాఖకు ఉన్నంత నెట్వర్క్… మరే దేశంలోనూ ఏ పోస్టల్ సంస్థకు లేదు. మనకు స్వాతంత్ర్యం రాక ముందు నుంచే బలంగా ఉన్న వ్యవస్థల్లో భారతీయ తపాలా శాఖ ఒకటి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ఘనత పోస్టల్ శాఖకు ఉంది.బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు డాక్ సేవకుల ద్వారానే అందుతున్నాయి. వికసిత్ భారత్, స్వరాంధ్ర సాధనకు డాక్ సేవకులు వెన్నెముక అని సీఎం చంద్రబాబు అన్నారు.

డాక్ సేవకులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు…

డాక్ సేవకుల గౌరవం పెంచేలా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పనిచేస్తున్నారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్ సింధియాతో నేను కలిసి పని చేశాను. విశాఖలోని గాజువాకలో ఒక ప్రాంతానికి సింధియా పేరుంది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని జ్యోతిరాదిత్య సందర్శించాలని కోరుతున్నాను. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవత్వంతో పని చేసిది డాక్ సేవకులే. వారి కోసం కేంద్ర మంత్రి డ్రెస్ కోడ్ ను డిజైన్ చేశారు. డాక్ సేవకులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు.

ఏఐ స‌ద‌స్సులో కాంగ్రెస్ ప‌రువు తీసింది…..

నేను ఆనాడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. నేను రూపొందించిన విజన్ కారణంగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ నుంచి వస్తోంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహిస్తే దేశ పరువు తీసే విధంగా కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనలు చేసింది. వారికి ఏఐ తెలీదు. టెక్నాలజీపై అవగాహన లేదు. బ్రాండ్ దెబ్బతీసేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *